Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt 90 Percent Subsidy For Drip Irrigation,ఏపీలో ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు శుభవార్త.. 90శాతం రాయితీతో పరికరాలు ఇస్తారు – ap govt decided to implement 100 percent subsidy on micro irrigation and 90 percent subsidy on drip irrigation equipment to fra land patta holders
ఆంధ్రప్రదేశ్

Ap Govt 90 Percent Subsidy For Drip Irrigation,ఏపీలో ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు శుభవార్త.. 90శాతం రాయితీతో పరికరాలు ఇస్తారు – ap govt decided to implement 100 percent subsidy on micro irrigation and 90 percent subsidy on drip irrigation equipment to fra land patta holders

.By .19 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt 90 Percent Subsidy For Drip Irrigation,ఏపీలో ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు శుభవార్త.. 90శాతం రాయితీతో పరికరాలు ఇస్తారు – ap govt decided to implement 100 percent subsidy on micro irrigation and 90 percent subsidy on drip irrigation equipment to fra land patta holders
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt 90% Subsidy For Drip Irrigation: ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు భారీగా రాయితీలు ప్రకటించింది. 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తుంపర సేద్యానికి అవసరమైన పరికరాలను 90శాతం రాయితీపై అందిస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 2.26 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌ఆర్‌ఏ పట్టాలు ఉండి ఈ పథకానికి అర్హులైనవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో ఎఫ్‌ఆర్‌ఏ పట్టదాారులకు భారీగా రాయితీలు
  • 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం అమలు
  • 90% రాయితీతో తుంపర సేద్యానికి పరికరాలు
AP DRF Farmers 90% Subsidy For Drip Irrigation
ఏపీ ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు 100% రాయితీపై సూక్ష్మసేద్యం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఏ (అటవీ హక్కుల చట్టం-ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌) పట్టాదారులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో ఉన్న పట్టాదారులకు 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 90శాతం రాయితీతో తుంపర సేద్యానికి అవసరమైన పరికరాలను కూడా అందివ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో
రాష్ట్రంలో మొత్తం 2.26 లక్షల మంది ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఎఫ్‌ఆర్‌ఏ పట్టదారులకు బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తారు. ధాత్రి అబా జన్‌జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఈ పరికరాలను సమకూర్చనున్నారు. సూక్ష్మసేద్యానికి ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద చిన్న, సన్నకారు రైతులైతే 55%, పెద్ద రైతులైతే 45% రాయితీ పథకం అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% చొప్పున భరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఏపీప్రభుత్వం 100శాతం రాయితీ ఇస్తోంది. అదే మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు 90% రాయితీ అమలు చేస్తోంది. అదే పెద్ద రైతులు ఉంటే 70శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని భరిస్తోంది. అయితే తాజాగా కేంద్రం ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు కేంద్రం 100% రాయితీ భరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తుంపర సేద్య పరికరాలపై 50% రాయితీ అందిస్తుండగా.. ఇప్పుడు కేంద్రం ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు ఏకంగా 90% చొప్పున రాయితీ అందించనుంది.

అర్హత ఉన్న ఎఫ్‌ఆర్‌ఏ (అటవీ హక్కుల చట్టం-ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌) పట్టాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 100% రాయితీపై సూక్ష్మసేద్యం చేసుకునే అవకాశం వచ్చింది. ఇటు తుంపర సేద్య పరికరాలపై 90% రాయితీ ఇస్తారు. అయితే ఎనిమిది జిల్లాల్లోని ప్రజలకు మాత్రమే ఈ రాయితీ దక్కుతుంది. ఈ రాయితీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వ్యవసాయశాఖ అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి