Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL Records : ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు.. చెన్నై గడ్డపై తను సృష్టించిన సునామీ 14 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

26 March 2026

పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం | Mother Killed Infant Because She Cried for Milk — Atrocity in Tirupati District in andhrapradesh

26 March 2026

అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Garikapati Team Clarity On Mid Day Meals Scheme,వైరల్ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందన.. జీర్ణించుకోలేక, పేదలకు దూరం చేసేందుకు ఇదంతా.. – garikapati narasimha rao team clarity on mid day meals scheme comments viral video
ఆంధ్రప్రదేశ్

Garikapati Team Clarity On Mid Day Meals Scheme,వైరల్ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందన.. జీర్ణించుకోలేక, పేదలకు దూరం చేసేందుకు ఇదంతా.. – garikapati narasimha rao team clarity on mid day meals scheme comments viral video

.By .20 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Garikapati Team Clarity On Mid Day Meals Scheme,వైరల్ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందన.. జీర్ణించుకోలేక, పేదలకు దూరం చేసేందుకు ఇదంతా.. – garikapati narasimha rao team clarity on mid day meals scheme comments viral video
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందించింది. గరికపాటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. దుష్ర్పచారం చేస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి కుతంత్రాలను నమ్మవద్దని.. ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతి అని స్పష్టం చేసింది.

Garikapati Narasimha rao team on mid day meals video
మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు(ఫోటోలు– Samayam Telugu)
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు. బట్టలు, భోజనం అన్నీ ఉచితంగా అందిస్తే, వారు చదువుపై దృష్టి పెట్టడం లేదని గరికపాటి విమర్శించినట్లు అందులో ఉంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఎక్కువై, చదువు మిధ్య అయ్యిందని.. భోజనంలో గుడ్డుపెట్టారా అనేది.. చదువు కంటే ఎక్కువైపోయిందన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇన్ని సమకూరిస్తే విద్యార్థి చదవకుండా శోభనం పెళ్లికొడుకులా మంచమెక్కి కూర్చుంటాడంటూ గరికపాటి అన్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో గరికపాటి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందించింది. గరికపాటి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు చేసినట్లుగా ప్రచారమవుతున్న వీడియోను వక్రీకరించారని ఆయన టీమ్ పేర్కొంది. తెలుగు మహాసభలలో ఆయన అలా మాట్లాడలేదని.. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో మాట్లాడిన మాటలను కలిపి, వీడియోకు జత చేసి వ్యతిరేక అర్థాలు వచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ స్పష్టం చేసింది. ఆయనెప్పుడూ పేదల పక్షమేనని.. ఆయన ప్రసంగాలలో ధనవంతులు, పేదల పట్ల ఔదార్యం చూపించి ఆదుకోవాలని చెప్తుంటారని పేర్కొంది. సంక్షేమ గురుకులాలు, పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారం, పాలు, దుప్పట్లు, వస్త్రాలు దానం చేసేందుకు ముందుకు రావాలంటూ దాతలను అనేకసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది.

శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా.. దళితవాడలలో పంచిపెట్టాలని ఎన్నోసార్లు గరికపాటి పిలుపునిచ్చారని ఆయన టీమ్ పేర్కొంది. భగవంతుడు ఎల్లప్పుడూ పేదవాళ్ల పార్టీనే ఎన్నో వేదికలపై చెప్పారని.. ఆయన ప్రసంగాల ప్రభావంతో పేదలు హిందూధర్మ స్ఫూర్తితో ఉన్నారని తెలిపింది. అయితే ఇది చూసి జీర్ణించుకోలేక, గరికపాటిని పేదల నుంచి దూరం చేసేందుకు కొంతమంది మూర్ఖులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ ఆరోపించింది. ఇలాంటి కుతంత్రాలకు ఎవ్వరూ కూడా లొంగవద్దని.. హిందువులంతా సమైక్యంగా, సామరస్యంతో జీవించాలనేదే గరికపాటి ఆకాంక్ష అని పేర్కొంటూ గరికపాటి నరసింహరావు టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి