Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dreams: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందో తెల్సా.. జరిగేది ఇదే.!

22 March 2026

నమ్మకానికి ముప్పు ఈ రాశులా? మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి!

22 March 2026

Akepati Subhashini Kiran Royal Dance,Janasena: కిరణ్ రాయల్‌తో డ్యాన్స్ వీడియో.. స్పందించిన ఆకేపాటి సుభాషిణి.. – janasena veera mahila akepati subhashini on her dance with kiran royal video

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rtc Driver Karnataka Conductor Srisailam,శ్రీశైలం: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్ దాడి.. బలవంతంగా బస్సులోకి ఎక్కించి మరీ.. – karnataka bus conductor and passengers attack apsrtc driver at srisailam shikharam checkpost of nandyal
ఆంధ్రప్రదేశ్

Rtc Driver Karnataka Conductor Srisailam,శ్రీశైలం: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్ దాడి.. బలవంతంగా బస్సులోకి ఎక్కించి మరీ.. – karnataka bus conductor and passengers attack apsrtc driver at srisailam shikharam checkpost of nandyal

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rtc Driver Karnataka Conductor Srisailam,శ్రీశైలం: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్ దాడి.. బలవంతంగా బస్సులోకి ఎక్కించి మరీ.. – karnataka bus conductor and passengers attack apsrtc driver at srisailam shikharam checkpost of nandyal
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మీద కర్ణాటక కండక్టర్ దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లాలోని శ్రీశైల శిఖరం చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. కర్ణాటక బస్సును అడ్డదిడ్డంగా నడపటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఏపీ ఆర్టీసీ డ్రైవర్, కర్ణాటక డ్రైవర్‌ను బస్సు సరిగా నడపలేవా అని ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి పీలేరు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ భాషాపై.. కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు దాడి చేశారు. బస్సులోకి బలవంతంగా ఎక్కించి, కొట్టుకుంటూ వెళ్లి డోర్నాల వద్ద వదిలేశారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

APSRTC
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్ దాడి(ఫోటోలు– Samayam Telugu)
ఇరుగు పొరుగు రాష్ట్రాల ఉద్యోగులు అంటే వారి మధ్య సమన్వయం, పరస్పర సహకారం ఉండాలి. కానీ నంద్యాల జిల్లాలో మాత్రం ఊహించని ఘటన జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై.. కర్ణాటకకు చెందిన కండక్టర్ , ప్రయాణికులు దాడి చేశారు. బలవంతంగా బస్సులోకి ఎక్కించి.. అతణ్ని చితకబాదారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శిఖర చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కర్ణాటక కండక్టర్, ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కర్ణాటక బస్సు లు రెండు శ్రీశైలం శిఖరం చెక్‌పోస్టు రహదారిలో ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక బస్సు డ్రైవర్ క్యూ ప్రకారం కాకుండా.. బస్సును ఇష్టానుసారం నడపటంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఆంటకం కలిగింది. దీంతో పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషా.. బస్సును సరిగ్గా నడపాలని, అడ్డదిడ్డంగా ఎందుకు నడుపుతున్నారని కర్ణాటక బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి , తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి మధ్యలో జోక్యం చేసుకున్న కర్ణాటక బస్సు కండక్టర్ , బస్సులోని కొందరు ప్రయాణికులు..ఏపీ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేశారు.

పీలేరు ఆర్టీసీ బస్ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులోకి ఎక్కించి అతనిపై దాడి చేశారు. అనంతరం డోర్నాల వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో నిర్హాంతపోయిన డ్రైవర్ చాంద్ భాషా.. వెంటనే డోర్నాల పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంద్ భాషా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటక బస్సు కండక్టర్, ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరోవైపు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం వస్తుంటారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, కాలినడకన భక్తులు అనేక మంది శ్రీశైలం చేరుకుని మల్లన్నను దర్శించుకుంటున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాల్సిన సమయంలో.. ఇలా గొడవలు పడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి