విశాఖ ప్రజలకు ముఖ్య గమనిక. మెయిన్ పంపింగ్ స్టేషన్లోని పాత మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మార్చి 23వ తేదీ సోమవారం విశాఖలోని పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. అలాగే అంతర్జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా.. నీటిని పొదుపుగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలని కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.

అలాగే 22వ వార్డులోని బాలాజీ నగర్, టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయ ప్రాంతం, సిద్ధార్థ నగర్.. 28వ వార్డులోని ఫేకోర్ లేఅవుట్, రామ్ నగర్. చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. జీవీఎంసీ వెస్ట్ జోన్లోని 24వ వార్డులో ఉన్న ఓల్డ్ రెసపువనిపాలెం, వినాయక్ నగర్, తులసి ఓట. స్వర్ణభారతి స్టేడియం ప్రాంతం ఉన్నాయి. విశాఖ సౌత్జోన్కు సంబంధించి అశోక్ నగర్, రామా టాకీస్ రోడ్, శ్రీనగర్, బుధిల్ రోడ్డు, రెడ్డి హాస్పిటల్ రోడ్డు, శ్రీనగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, ద్వారకా నగర్ రోడ్, అమర్ నగర్ చర్చి రోడ్డు, సీబీఎం కాంపౌండ్ ప్రాంతాలతో తాగునీటి సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.
మరోవైపు అంతర్జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా.. ప్రజలందరూ నీటిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కోరారు. ముఖ్యంగా వేసవి కాలంలో మరింత బాధ్యతగావాడాలని, సుస్థిర జల సంరక్షణకు మద్దతు ఇవ్వాలని కోరారు.శాస్త్రీయ ప్రణాళిక, జల సంరక్షణ, మురుగునీటి పునర్వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణ, జలాశయాల పునరుజ్జీవనం, అమృత్ 2.0 కార్యక్రమాల ద్వారా నీటి సంరక్షణకు జీవీఎంసీ కట్టుబడి ఉందన్నారు. ప్రతి నీటి చుక్కకు విలువ ఇద్దామని.. నీటి భద్రత కలిగిన విశాఖపట్నం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.


