Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026

Drain Flies: మీ బాత్రూమ్ గోడలపై ఈ చిన్న ఈగలు కనిపిస్తున్నాయా?.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ కనిపించవు..

22 March 2026

Weather Update On 23 March 2026,AP Rains: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ జిల్లాలలో పిడుగులతో వానలు.. బీ అలర్ట్.. – apsdma weather forecast light to modarates rain with thunders on march 23rd in andhra pradesh

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kerosene For Ration Card Holders In AP,రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.. – kerosene distribution for ration card holders in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Kerosene For Ration Card Holders In AP,రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.. – kerosene distribution for ration card holders in andhra pradesh

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kerosene For Ration Card Holders In AP,రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.. – kerosene distribution for ration card holders in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనుంది. ఏపీకి కేంద్రం 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రేషన్ కార్డుకు లీటర్ చొప్పున ఈ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి (మార్చి 23) గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏపీలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు.

Kerosene in ap
ఏపీలో రేషన్ కార్డుదారులకు కిరోసిన్(ఫోటోలు– Samayam Telugu)
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం (మార్చి 23) నుంచి కిరోసిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే కిరోసిన్ పంపిణీ ప్రక్రియను తొలుత మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాలలో చేపట్టనున్నారు. ఆ ప్రాంతాల్లోని లబ్ధిదారులు.. ఒక్కో రేషన్ కార్డుపై లీటర్ చొప్పున కిరోసిన్ అందించనున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకు చేరాల్సిన నౌక.. మార్చి 26వ తేదీన వస్తోంది. అయితే రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెలలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు.మరోవైపు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ కోరారు.

పాఠశాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా.. లేదా అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. అతి త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి