Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఫుట్‌పాత్‌లపై ఏడుస్తూ నిద్రపోయేవాడిని..తిండిలేక చనిపోదామనుకున్నా.. కానీ ఇప్పుడు

26 March 2026

మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! | AP CM Chandrababu reviewed the Markapuram bus accident.. cm revanth reddy expressed shock

26 March 2026

IPL Records : ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు.. చెన్నై గడ్డపై తను సృష్టించిన సునామీ 14 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anakapalli Steel Plant Foundation,AMNS Plant: ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం, లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు.. – chandrababu to lay foundation arcelor mittal nippon steel plant in nakkapalli of anakapalli
ఆంధ్రప్రదేశ్

Anakapalli Steel Plant Foundation,AMNS Plant: ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం, లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు.. – chandrababu to lay foundation arcelor mittal nippon steel plant in nakkapalli of anakapalli

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anakapalli Steel Plant Foundation,AMNS Plant: ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం, లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు.. – chandrababu to lay foundation arcelor mittal nippon steel plant in nakkapalli of anakapalli
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో రేపు (మార్చి 23) మరో ముందడుగు పడనుంది. ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌‍కు సోమవారం శంకుస్థాపన జరగనుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్‌కు రేపు భూమి పూజ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

Anakapalli Steel plant Foundation
అనకాపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో సోమవారం (మార్చి 23) కీలక అడుగు పడనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS India) స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అంచనా. మొత్తం 5465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.

మరోవైపు అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని రెండు దశలలో చేపట్టనున్నారు. మొదటి దశలో ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఓ కాప్టివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయనుంది. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాలలో ఈ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అదనంగా 11 వేల 198 కోట్లు కేటాయించనున్నారు. దీని ద్వారా మరో ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం ఎకనమిక్ జోన్.. పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. అలాగే దేశీయంగా ఉక్కు అవసరాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తోంది. అందులో భాగంగా 16వ నంబర్ జాతీయ రహదారిని.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు కలిపేలా నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు.

సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది.సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శిస్తారు. ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్‌ పరిశీలిస్చాకుయ అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి