Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువతిలా..ముసలితనాన్ని ఆపేందుకు రూ.94 లక్షల ఖర్చు! కట్‌చేస్తే..

23 March 2026

ఆకుపచ్చ ద్రాక్ష vs నలుపు ద్రాక్ష! ఏది తింటే ఆరోగ్యానికి లాభం.. కంటి చూపుకు ఏది బెస్ట్

23 March 2026

అరటి తొక్కపై కాలు వేస్తే ఎందుకు జారిపడతాం.. దాన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Fake Swamiji Krishna District,కృష్ణా జిల్లా: రూ. లక్ష ఇవ్వు.. లేకపోతే శపిస్తా.. వృద్ధురాలిని బెదిరించిన స్వామిజీలు – unknown persons enter into home like swamiji and demand 1 lakh to old woman in aakunuru of krishna district
ఆంధ్రప్రదేశ్

Fake Swamiji Krishna District,కృష్ణా జిల్లా: రూ. లక్ష ఇవ్వు.. లేకపోతే శపిస్తా.. వృద్ధురాలిని బెదిరించిన స్వామిజీలు – unknown persons enter into home like swamiji and demand 1 lakh to old woman in aakunuru of krishna district

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Fake Swamiji Krishna District,కృష్ణా జిల్లా: రూ. లక్ష ఇవ్వు.. లేకపోతే శపిస్తా.. వృద్ధురాలిని బెదిరించిన స్వామిజీలు – unknown persons enter into home like swamiji and demand 1 lakh to old woman in aakunuru of krishna district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


లక్ష రూపాయలు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధురాలిని కొంతమంది స్వామీజీలు బెదిరించిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మణి అనే మహిళ ఇంటికి వచ్చిన నలుగురు వ్యక్తులు, తాము స్వామీజీలమని పరిచయం చేసుకున్నారు. తమ ఆశ్రమంలోని గోవుల సంరక్షణ కోసం రూ. లక్ష ఇవ్వాలని.. లేకపోతే శపిస్తామని బెదిరించారు. దీంతో మహిళ తన వద్ద ఉన్న ఐదు వేలు వారికి ముట్టజెప్పింది. అనంతరం భయంతో పోలీసులను ఆశ్రయించారు.

Fake Swamijies 1 lakh Aakunuru in Vuyyuru
లక్ష ఇవ్వకుంటే శపిస్తా స్వామీజీల బెదిరింపు(ఫోటోలు– Samayam Telugu)
మోసగాళ్లు రూటు మారుస్తున్నారు. వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో చోటుచేసుకుంది. మందాడ ప్రసాదరావు, మణి అనే భార్యభర్తలు ఆకునూరులో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం రోజు ఉదయం వీరి ఇంటికి నలుగురు అపరిచిత వ్యక్తులు వచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించి, మంత్రోచ్ఛారణతో ఇంటిలోకి అడుగుపెట్టారు. తాము స్వామీజీలమని నీ భర్త మాకు తెలుసంటూ మణితో పరిచయం చేసుకున్నారు. తమకు ఆశ్రమం ఉందని.. ఆశ్రమంలో ఆవుల సంరక్షణ కోసం లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె సమాధానం ఇవ్వటంతో.. స్వామీజీలు రూటు మార్చారు.

లక్ష రూపాయలు ఇవ్వకపోతే శపిస్తామని ఆమెను భయపెట్టారు. దీంతో భయపడిన పోయి మణి.. తన వద్ద కేవలం రూ.5000 మాత్రమే ఉన్నాయంటూ ఆ మొత్తాన్ని వారికి అందించారు. అయితే ఇదే సమయంలో మణి మేనల్లుడు ఊరు నుంచి వచ్చాడు. అపరిచిత వ్యక్తులు అతణ్ని కూడా బెదిరించి అతని వద్ద నుంచి మరో వేయి రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే స్వామీజీల రూపంలో ఇంటికి వచ్చినవారు బెదిరించటంతో మణి, ఆమె మేనల్లుడు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఉయ్యూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరినీ విచారించారు. అనంతరం బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో స్వామీజీలు ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా వచ్చినవారు ఎవరనే దానిపై ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు అపరిచిత వ్యక్తులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే.. భయపడవద్దని పోలీసులు చెప్తున్నారు.

అలాంటి వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అలాగే నకిలీ స్వామీజీల మోసాలపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలతో పాటుగా ఇలా ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించేవారు, విరాళాలు అడిగి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి