Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ChatGPT: పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి.. మీ లైఫ్‌ రిస్క్‌లో పడినట్టే!

24 March 2026

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

24 March 2026

Rythu Bharosa: తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్.. ఈ పనిచేస్తేనే అకౌంట్లోకి..

24 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pita Naga Mohan Krishna Repalle Ysrcp In Charge,టీడీపీ కంచుకోటలో వ్యూహం మార్చిన వైసీపీ.. ‘హ్యాట్రిక్ రికార్డ్’ మంత్రి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ – pita naga mohan krishna appointed as repalle constituency ysrcp in charge
ఆంధ్రప్రదేశ్

Pita Naga Mohan Krishna Repalle Ysrcp In Charge,టీడీపీ కంచుకోటలో వ్యూహం మార్చిన వైసీపీ.. ‘హ్యాట్రిక్ రికార్డ్’ మంత్రి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ – pita naga mohan krishna appointed as repalle constituency ysrcp in charge

.By .24 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pita Naga Mohan Krishna Repalle Ysrcp In Charge,టీడీపీ కంచుకోటలో వ్యూహం మార్చిన వైసీపీ.. ‘హ్యాట్రిక్ రికార్డ్’ మంత్రి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ – pita naga mohan krishna appointed as repalle constituency ysrcp in charge
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Repalle Ysrcp In Charge Pita Naga Mohan Krishna: హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న ఏపీ మంత్రి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గానికి కొత్తగా పీట నాగ మోహన్ కృష్ణను సమన్వయకర్తగా నియమించింది. రేపల్లెలో పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేసింది. రేపల్లె బాధ్యతలు చేపట్టిన వెంటనే మోహన్ కృష్ణ నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టారు.

హైలైట్:

  • ఏపీ మంత్రి నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంఛార్జ్
  • రేపల్లె బాధ్యతలు నాగ మోహన్‌కు అప్పగింత
  • ఆ మంత్రికి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డ్
Repalle Ysrcp Incharge
రేపల్లె వైసీపీ ఇంఛార్జ్ మోహన్(ఫోటోలు– Samayam Telugu)
2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీచింది.. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల్లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. వైఎస్సార్‌సీపీ మార్పులు, చేర్పులు చేశారు. కొత్తగా కమిటీలను నియమిస్తున్నారు.. కూటమి పార్టీలకు కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఏపీ మంత్రి, వరుసగా మూడుసార్లు రేపల్లె నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తను మార్చేశారు. రేపల్లె నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా మారింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ వరుసగా విజయం సాధించారు. అలాంటి నియోజకవర్గంలో బలమైన వ్యక్తి ఉండాలని భావించిన వైఎస్సార్‌సీపీ.. ఇటీవల పీట నాగ మోహన్ కృష్ణ వైపు మొగ్గు చూపింది.. ఆయన్ను రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమించింది. రేపల్లె నియోజకవర్గం నగరం మండలం పీటా వారిపాలెంకు చెందిన మోహన్‌ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని.. పీట నాగ మోహన్ కృష్ణకు రేపల్లె నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఆయన కూడా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రేపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు.. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పోటీచేసి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ మోపిదేవికి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.. రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా రేపల్లెలో మాత్రం ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రేపల్లెలో ఓడిపోయిన మోపిదేవికి వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశారు. కానీ 2020లో రాజకీయ పరిణామాలు మారడంతో వెంకటరమణ మంత్రి పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. ఆ వెంటనే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది.

2024 ఎన్నికలకు ముందు మోపిదేవి వెంకటరమణను కాదని రేపల్లెలో వైఎస్సార్‌‌‌సీపీ అభ్యర్థిని మార్చేసింది. డాక్టర్ ఈవూరు గణేష్‌కు టికెట్ ఇవ్వగా.. మోపిదేవి ఆయనకు మద్దతు తెలిపారు. అయినా సరే 2024లోనూ అనగాని సత్యప్రసాద్ చేతిలో గణేష్ ఓడిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు వైఎస్సార్‌సీపీకి ఓటమి ఎదురుకగా.. ఇంతలో రేపల్లెలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈవూరు గణేష్ కూడా నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్నారనే టాక్ ఉంది. దీంతో రేపల్లెలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది.. పీటా నాగ మోహన్ కృష్ణవైపు మొగ్గు చూపింది. ఆయన రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. మరి కొత్త ఇంఛార్జ్‌తోనైనా రేపల్లెలో లక్ మారుతుందుమో చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి