Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NEET: నీట్ ఎగ్జామ్‌కు ఇంకా 5 వారాలే.. మెడికల్ సీటు కొట్టాలంటే ఇవి పక్కా ఫాలో అవ్వండి

30 March 2026

టెన్త్ స్టూడెంట్‌పై టీచర్ అఘాయిత్యం.. సీక్రెట్ కెమెరాలో రికార్డ్.. ట్విస్ట్ ఏంటంటే | Narayanpet School Abuse Case: Teacher Arrested After Viral Video Exposes Crime, shocking twist

30 March 2026

WhatsApp: సిమ్ లేకపోయినా వాట్సప్ సేవలు.. కేంద్రం నుంచి పెద్ద ఊరట.. అప్పటివరకు మాత్రమే..

30 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rajahmundry Adulterated Milk Deaths,రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల ఘటన ప్రస్తావన.. రూ.10 లక్షల చొప్పున పరిహారానికి వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ – ysrcp mp yv subba reddy speaks on adulterated milk case in rajahmundry
ఆంధ్రప్రదేశ్

Rajahmundry Adulterated Milk Deaths,రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల ఘటన ప్రస్తావన.. రూ.10 లక్షల చొప్పున పరిహారానికి వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ – ysrcp mp yv subba reddy speaks on adulterated milk case in rajahmundry

.By .24 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rajahmundry Adulterated Milk Deaths,రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల ఘటన ప్రస్తావన.. రూ.10 లక్షల చొప్పున పరిహారానికి వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ – ysrcp mp yv subba reddy speaks on adulterated milk case in rajahmundry
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


YV Subba Reddy in Rajahmundry Adulterated milk issue: రాజమండ్రి కల్తీ పాల ఘటన అంశాన్ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఏఐ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు అవసరమని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

YV Subba reddy on Rajahmundry milk death in Rajya sabha
రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల ఘటన(ఫోటోలు– Samayam Telugu)
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటన వ్యవహారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని రాజ్యసభ సమావేశాలలో లేవనెత్తారు. జీరో అవర్‌లో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ జరగకుండా అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కోరారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారన్న వైవీ సుబ్బారెడ్డి.. పాల కల్తీ వలన ఎంతో మంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ప్రాణాలను కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎస్ఏఐ అధికారులు నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టాలని.. నమూనాలు సేకరించి ప్రయోగాశాలల్లో పరీక్షించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

మరోవైపు ఏవైనా వస్తువులు కొరత ఉన్నప్పుడే, వాటిని కల్తీ చేయటం చూస్తుంటామన్న వైవీ సుబ్బారెడ్డి.. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. మనిషి ఆరోగ్యానికి పాలు ఎంతో ముఖ్యమైనవని.. ఇలాంటి పాల కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో కోరారు. మరోవైపు రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారు. కిడ్నీలు దెబ్బతిని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఫిబ్రవరి 16న రాజమండ్రి కల్తీ పాల ఘటన చోటుచేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు జరపగా.. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలలో పాలలో ఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లు తేలింది. ఫ్రీజర్‌లోఇథిలీన్ గ్లైకాల్ లీకై.. పాలలో కలిసినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలు తాగిన వారు అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారు. ఈ కేసులో పాల వ్యాపారి గణేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి