Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! | AP CM Chandrababu reviewed the Markapuram bus accident.. cm revanth reddy expressed shock

26 March 2026

IPL Records : ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు.. చెన్నై గడ్డపై తను సృష్టించిన సునామీ 14 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

26 March 2026

పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం | Mother Killed Infant Because She Cried for Milk — Atrocity in Tirupati District in andhrapradesh

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Terror Link Case,విజయవాడ టెర్రర్ లింక్.. వెలుగులోకి కీలక విషయాలు.. – court remands accused in vijayawada terror link case till april 6th 2026
ఆంధ్రప్రదేశ్

Vijayawada Terror Link Case,విజయవాడ టెర్రర్ లింక్.. వెలుగులోకి కీలక విషయాలు.. – court remands accused in vijayawada terror link case till april 6th 2026

.By .24 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Terror Link Case,విజయవాడ టెర్రర్ లింక్.. వెలుగులోకి కీలక విషయాలు.. – court remands accused in vijayawada terror link case till april 6th 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉగ్రవాదులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు యువకులకు విజయవాడ సీసీఎం కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నాయంటూ ముగ్గురు యువకులను విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి ఉగ్రవాద భావజాలాన్ని యువతలో ప్రోత్సహించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

Vijayawada Terror link case
జయవాడలో ఉగ్రవాద సంబంధాలు ఉన్న యువకులు అరెస్ట్(ఫోటోలు– Samayam Telugu)
Vijayawada youth Terror link case: విజయవాడలో ఉగ్రవాద సానుభూతిపరుల కదలికల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పాకిస్థాన్‌ హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని.. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ టూటౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ డానిష్, మీర్జా సొహైల్ మహమ్మద్ రహంతుల్లా షరీఫ్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ యువకులు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి నిధులు సమకూరుతున్నట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ముగ్గురు నిందితులను విజయవాడ పోలీసులను విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఏప్రిల్ ఆరో తేదీ వరకూ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వీరిని విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు విచారణ సందర్భంగా లాయర్‌ను నియమించుకున్నారా? అని న్యాయమూర్తి నిందితులను ప్రశ్నించారు. అయితే తాము నియమించుకోలేమని నిందితులు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఈ కేసులో యాంటీ టెర్రరిస్ట్ దళాలు జరిపిన విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురు యువకులు ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో గ్రూపును ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఏడు రాష్ట్రాలలో 42 మంది సభ్యులతో ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపు ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటుగా ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ముఖానికి మాస్కులతో ఫోటోలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు, ఆడియోలు పెడుతున్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ , అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి