Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! | Markapuram Bus Accident: CM Chandrababu Announces rs.5 Lakh Ex-Gratia for deceased Victims

26 March 2026

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

26 March 2026

‘తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర’.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? | saleshwaram Jatara 2026: Embark on Telangana Amarnath Yatra Through Nallamala Forest Telangana

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Amaravati Fire Accident,అమరావతి: వరుస అగ్ని ప్రమాదాలు.. చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు.. – cm chandrababu review on amaravati fire accidents
ఆంధ్రప్రదేశ్

Chandrababu Amaravati Fire Accident,అమరావతి: వరుస అగ్ని ప్రమాదాలు.. చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు.. – cm chandrababu review on amaravati fire accidents

.By .24 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Amaravati Fire Accident,అమరావతి: వరుస అగ్ని ప్రమాదాలు.. చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు.. – cm chandrababu review on amaravati fire accidents
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రాయపూడి అగ్నిప్రమాద ఘటనలో ప్లాస్టిక్ పైపులు కాలిపోయిన ఘటనపై చర్చించారు. వరుస అగ్నిప్రమాదాలు ప్రమాదవశాత్తూ జరుగుతున్నాయా.. లేక వీటి వెనుక ఏదైనా కుట్ర ఉందే అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మేఘా కంపెనీకి చెందిన పైపులు కాలిపోయాయి.

Chandrababu
అమరావతి అగ్ని ప్రమాదాలపై చంద్రబాబు సమీక్ష(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాలతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాయపూడిలోని హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద పైపులు కాలిపోయిన ఘటనపై చర్చించారు. అమరావతిలోని భవన నిర్మాణ ప్రాంతాల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నిజంగానే ప్రమాదాలా, లేక వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే విషయాన్ని వెలికి తీయాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు సోమవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని హెచ్ఓడీ టవర్స్ నిర్మాణం వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డిపార్టుమెంట్ అధికారులు.. మూడు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు ఇటీవలే వెలగపూడి సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎల్అండ్‌టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు మంటల్లో కాలిపోయాయి. ఆ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ దర్యాప్తు పూర్తికాకముందే మరో అగ్నిప్రమాదం జరగటంతో.. వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరోవైపు అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో పలు అనుమానాలను వంగలపూడి అనిత వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగిందన్న హోం మంత్రి అనిత.. దాన్ని ఓర్వలేక అమరావతిలో పైపులకు నిపు పెట్టారా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. గతంలో అమరావతిలో అరటితోటకు నిప్పు పెట్టిన ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ చేయాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి