Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు

25 March 2026

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

25 March 2026

OTT Movie: కూతురి హత్యకు రివేంజ్.. ఓటీటీలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Praveen Pagadala Memorial Day,పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకార్థం ఉచిత భోజనాలు, క్యూ కట్టిన జనం.. మంత్రి ట్వీట్ – free meals at palakollu government hospital due to pastor praveen pagadala memorial day
ఆంధ్రప్రదేశ్

Praveen Pagadala Memorial Day,పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకార్థం ఉచిత భోజనాలు, క్యూ కట్టిన జనం.. మంత్రి ట్వీట్ – free meals at palakollu government hospital due to pastor praveen pagadala memorial day

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Praveen Pagadala Memorial Day,పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకార్థం ఉచిత భోజనాలు, క్యూ కట్టిన జనం.. మంత్రి ట్వీట్ – free meals at palakollu government hospital due to pastor praveen pagadala memorial day
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సంస్మరణ దినం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సంస్మరణ దినం సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం కొన్నిచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉచిత భోజనాలు ఏర్పాటు చేయగా.. జనం భారీగా తరలివచ్చారు. ఈ వీడియోను మంత్రి నిమ్మల రామానాయుడు షేర్ చేశారు.

Praveen pagadala
పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకార్థం ఉచిత భోజనాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఏడాది పూర్తి అవుతోంది. 2025 మార్చి 24వ తేదీన రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పగడాల ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ దినాన్ని పలుచోట్ల నిర్వహించారు. ఈ క్రమంలోనే పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాలు అందించారు. దబ్బా ఎస్తేరు రాణి ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వీడియోను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

పాలకొల్లులోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాలు అందిస్తున్నారు. రోజుకో దాత విరాళాలు అందించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన వీడియోలను మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బైక్ మీద వస్తూ రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించింది.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. దీనిని రోడ్డు ప్రమాదంగా నిర్ధారించారు. సాంకేతికత సాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించారు. అలాగే ఫోన్‌ కాల్స్ డేటా. కుటుంబసభ్యుల విచారణ చేపట్టారు. యూపీఐ పేమెంట్స్ సహా అన్ని అంశాలను పరిశీలించిన పోలీసులు.. మద్యం మత్తులో డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన చనిపోయినట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అయితే సంస్మరణ దినం సందర్భంగా ప్రస్తుతం ఈ అంశం మల్లీ తెరపైకి వచ్చింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి