Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

26 March 2026

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Lpg Tanker Reach Visakhapatnam,గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక.. ఈ నెలాఖరుకి మరో రెండు – oil and gas crisis lpg tanker bw birch and oil tanker mt detroit reached visakhapatnam port
ఆంధ్రప్రదేశ్

Lpg Tanker Reach Visakhapatnam,గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక.. ఈ నెలాఖరుకి మరో రెండు – oil and gas crisis lpg tanker bw birch and oil tanker mt detroit reached visakhapatnam port

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Lpg Tanker Reach Visakhapatnam,గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక.. ఈ నెలాఖరుకి మరో రెండు – oil and gas crisis lpg tanker bw birch and oil tanker mt detroit reached visakhapatnam port
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా వంట గ్యాస్, ఇంధన కొరత భయాలు నెలకున్నాయి. హర్మూజ్ జల సంధి నుంచి వచ్చే నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనల నడుమ భారీ నౌకలు విశాఖపట్నం తీరానికి శుక్రవారం చేరుకున్నాయి. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందుల వేళ బిర్చ్ అనే నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకోవడం, ఆయిల్ ట్యాంకర్ కూడా రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెలాఖరుకి మరో రెండు నౌకలు రాబోతున్నాయి.

LPG Ship
ఎల్పీజీ నౌక(ఫోటోలు– Samayam Telugu)
పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరతపై ఆందోళన నెలకున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా విశాఖవాసులకు ఊరట లభించింది. ‘BW బిర్చ్’ అనే భారీ ఎల్‌పీజీ ట్యాంకర్ విశాఖ నౌకాశ్రయానికి గురువారం చేరుకుంది. ఇందులో భారీ ఎత్తున వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దీంతో ఎల్పీజీ సరఫరాకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. బిర్చ్‌తో పాటు ‘ఎంటీ పెట్రాయిట్’ అనే ఆయిల్ ట్యాంకర్ నౌక కూడా ఇప్పటికే విశాఖకు చేరింది. ఇది పెట్రోల్, డీజిల్ అవసరాలకు సరిపడా నిల్వలను మోసుకొచ్చింది. వీటితో పాటు హెల్లాస్ గ్లాడియేటర్, గ్యాస్ జ్యూపిటర్ అనే మరో రెండు నౌకలు చెరో 24 వేల టన్నుల గ్యాస్‌తో బయలుదేరాయి. ఇవి మార్చి 30 నాటికి విశాఖపట్నానికి చేరుకునే అవకాశం ఉంది. హెల్లాస్ గ్లాడియేటర్ నౌక నెదర్లాండ్ నుంచి, గ్యాస్ జ్యూపిటర్ అమెరికా నుంచి గ్యాస్‌ను తీసుకొస్తున్నాయి.

ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతుండగా.. భారీ నిల్వలతో ఈ రెండు నౌకలు ఒకేసారి రావడంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం కేవలం విశాఖకే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల సప్లయ్ ఛైన్‌ను బలోపేతం చేయనుంది. పారిశ్రామిక అవసరాలకు సైతం ఇది ఉపయోగపడనుంది. అయితే, గ్యాస్ కొరత వస్తుందేమోననే భయాందోళనతో జనం ముందస్తు స్టాక్ పెట్టుకుంటున్నాయి. అయితే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

మరోవైపు, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ప్రభావం క్రమేపీ అన్నివర్గాలపై పడుతోంది. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తోపుడు బళ్లపై టిఫిన్, టీ విక్రయించే చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గృహవినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వం సూచనలతో గ్యాస్‌ ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేశాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో మెనూలను తగ్గించేయగా.. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు.. గత పదేళ్లుగా రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథనాలు, విశ్లేషణల రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. సోషల్ మీడియా పోస్టులను జీవీఎన్ అప్పారావు ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీకి సంబంధించిన కథనాలు రాసిన అనుభవం ఉంది.

జీవీఎన్ అప్పారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు సంస్థలో ఐదేళ్లకుపైగా పని చేశారు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి