
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్టార్టజీ గురించి చెప్పుకొచ్చారు. పార్టీ వ్యూహాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించామని, కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవులకు పోటీ చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులలో కసి ఉన్నప్పటికీ, ఏపీ నాయకులు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సంకీర్ణంలో భాగంగా ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ తన సొంత జెండాను, ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై పార్టీ దూకుడుగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని మాధవ్ నొక్కి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కలిసి పని చేస్తూనే, పార్టీ బలోపేతానికి పూర్తి అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దృష్టిని ఆకర్షించి, వారి ఆశలను నెరవేర్చే దిశగా పార్టీ విధానాలను రూపొందిస్తున్నామని మాధవ్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

