ఆంధ్రప్రదేశ్లో ఆదివారం రోజున ( మార్చి 29) 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 87 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం ఏపీలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. 48 చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజలు డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తీవ్ర వడగాల్పులు వీచే మండలాల జాబితా..
పార్వతీపురం మన్యం జిల్లా:
బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం
విజయనగరం జిల్లా:
బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, మెరకముడియం, రాజాం, రామభద్రాపురం, రేగిడిఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు
ఎన్టీఆర్ జిల్లా:
జి. కొండూరు. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాలు
పోలవరం జిల్లా:
చింతూరు. కూనవరం మండలాలు
శ్రీకాకుళం జిల్లా:
బూర్జ, హిర మండలాలు
అల్లూరి జిల్లా:
అనంతగిరి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల.. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,టోపీ వంటివి ధరించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే కాటన్ దుస్తులు ధరించాలని.. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని.. వీలైతే వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎండ సమయంలో బయటకు రాకపోవటమే మంచిదని సూచించింది.


