Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026: రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?

5 April 2026

Crow Lifespan: కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకులకు యమ డిమాండ్‌..

5 April 2026

మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే ఎన్నో రోగాలు పరార్‌!

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district
ఆంధ్రప్రదేశ్

Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district

.By .5 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visually Impaired Man Donate Land For School,అల్లూరి జిల్లా: మనసున్న మా”రాజు”.. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు – visually impaired man donated 15 cents of land for school and anganwadi center construction at nandigaruvu village in paderu of alluri district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఊరి సమస్యల పరిష్కారం కోసం ఓ అంధుడు తనకు ఉన్న 15 సెంట్ల భూమిని దానంగా ఇచ్చిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం నందిగరువు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలరాజుకు పుట్టుకతోనే కంటి చూపు లేదు. అయినప్పటికీ ఊరి సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ క్రమంలోనే తమ ఊరిలో బడి, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపు నిర్మాణం కోసం తనకు ఉన్న 14 సెంట్లను దానంగా అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని అభినందించి.. ఆయా నిర్మాణాలకు అతని పేరే పెట్టాలని ఆదేశించారు.

Visually impaired man donate land for school
పాఠశాల, అంగన్వాడీ కేంద్రం కోసం భూమి దానంగా ఇచ్చిన అంధుడు(ఫోటోలు– Samayam Telugu)
ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు మాత్రమే ఉంటే సరిపోదు.. మనసు కూడా ఉండాలని నిరూపించాడో వ్యక్తి. కళ్లతో చూసేవారికి అక్కడ జరిగే విషయం మాత్రమే తెలుస్తుంది.. కానీ మనసుతో చూసేవారికి.. ఆ బాధ, ఆ నొప్పి, ఆ సమస్య తీవ్రత తెలుస్తుందని తెలియజేశాడు. ఆ దేవుడు తనకు కళ్లు ఇవ్వకపోయినా, విశాలమైన మనసు, సాటి మనిషి బాధను అర్థం చేసుకునే గొప్ప హృదయం ఇచ్చాడు. అదే ఇప్పుడు ఓ ఊరి సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఎంతోమందికి అతణ్ని ఆదర్శంగా నిలుపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం నందిగరువుకు చెందిన బాలరాజు అనే వ్యక్తి చేసిన దానం.. ఇప్పుడు అతనిపై ప్రశంసలు కురిపిస్తోంది.

భూమి మీద ఉన్న దేన్ని అయినా కరెన్సీతో విలువ కట్టే పరిస్థితి ఇది. సమాజానికి నువ్వేం ఇస్తావ్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. ఈ ప్రపంచం నాకేమిస్తుంది అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనంటూ ఓ పెద్దమనిషి చెప్పిన విధంగా కరెన్నీ నోటు మానవ సంబంధాలను డిసైడ్ చేస్తున్న ఈ కాలంలో.. పుట్టుకతోనే చూపులేని ఓ వ్యక్తి.. తన ఊరి కోసం, తన ఊరి ప్రజల కోసం, వారి కష్టాలను తీర్చడం కోసం తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలాన్ని నిస్వార్థంగా, దానంగా ఇచ్చేసిన వైనం అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రపంచాన్ని చూడలేకపోయినా, తన ఊరి జనం బాధలు విన్న అతను.. వాటి పరిష్కారానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నందిగరువుకు చెందిన బాలరాజు అనే వ్యక్తికి పుట్టుకతోనే చూపు లేదు. చూపులేనప్పటికీ తమ ఊరిలోని సమస్యల గురించి అతనికి అవగాహన ఉంది. ఊర్లో పిల్లలు చదువుకునేందుకు బడి లేకపోవటం, పసి పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం లేకపోవటం గురించి ఊర్లో జనం చర్చించుకుంటూ ఉంటే విని తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తున్న బాలరాజుకు.. ఇటీవలే మంచి అవకాశం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తమ గ్రామానికి వస్తున్నారని బాలరాజు చెవినపడింది. పవన్ కళ్యాణ్‌కు తమ సమస్యలు తెలియజేసేందుకు ఊరి ప్రజలంతా గ్రామ చావడిలో సమావేశమయ్యారు.

ఈ సమయంలోనే బాలరాజు ముందుకొచ్చి ఊర్లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాఫు భవనాల నిర్మాణానిక తన స్థలాన్ని దానంగా ఇస్తానని ప్రకటించారు. తనకున్న 15 సెంట్ల భూమిని వీటిని కట్టేందుకు దానమిస్తున్నట్లు బాలరాజు ప్రకటించారు. బాలరాజు తీసుకున్న నిర్ణయంపై స్థానికులు అతన్ని అభినందించారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ చేరటంతో.. ఆయా భవనాలను బాలరాజు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ షాపు నిర్మాణానికి కావాల్సిన నిధులు, పాలనా అనుమతులు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి