Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
ఆంధ్రప్రదేశ్

నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?

.By .11 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గంపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. పుంగనూరు అత్యంత శాంతియుత నియోజకవర్గమని, అక్కడ ఎలాంటి గొడవలకు ప్రజలు ఇష్టపడరని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలను వివరించారు. పోలీసుల సూచనలను పాటించకుండా తెలుగుదేశం కార్యకర్తలే గొడవలకు పాల్పడ్డారని అన్నారు. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్‌ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

రెడ్ బుక్ ప్రచారం కేవలం ప్రతిపక్షాల హైప్ అని, పుంగనూరులో తాము ప్రజల మద్దతుతోనే గెలుస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలను బలవంతంగా చేయించలేదని, ప్రతిపక్షాలకు నామినేషన్ వేసే ధైర్యం లేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పుంగనూరులో గణనీయమైన అభివృద్ధి పనులు చేశామని మిథున్ రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలు బలవంతంగా జరిగాయనే ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి, ప్రతిపక్షాలు నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదని పేర్కొన్నారు. రామచంద్ర అనే వ్యక్తికి కేవలం 2000 ఓట్లు వచ్చాయని, ఆయనకు వచ్చిన పబ్లిసిటీ నమ్మవద్దని అన్నారు. తమ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నారని, అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పుంగనూరును అత్యంత శాంతియుత నియోజకవర్గంగా అభివర్ణించారు. అమర్ రాజా కంపెనీ విషయంలో తమ కుటుంబం జోక్యం చేసుకుందని వచ్చిన ఆరోపణలను మిథున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గల్లా జయదేవ్ తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, అమర్ రాజాకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. ఇవి కేవలం తప్పుడు ప్రచారాలని, వ్యక్తిగత విరోధాలు తమకు లేవని తెలిపారు. రాజకీయ పరంగా మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అంతేగానీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పారు.

రోజా వ్యవహారంపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. రోజా తమ బంధువని, ఆమె తండ్రి, తన తండ్రి మంచి స్నేహితులని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే మంత్రులు అవుతారని, ఆమె గెలుపు కోసం తాను కృషి చేశానని చెప్పారు. చక్రపాణి రెడ్డి, జేకే శాంతిలను పెంచి పోషించారనే ఆరోపణలు నిరాధారమని, వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితేనే వారికి వ్యతిరేకమని అన్నారు. రోజా స్వయంగా కోరితేనే వారికి శ్రీశైలం దేవస్థానం సభ్యత్వాలు ఇచ్చారని వివరించారు. నారాయణ స్వామికి మంత్రి పదవి ఇప్పించి తమ గుప్పెట్లో పెట్టుకున్నారనే ఆరోపణలను కూడా మిథున్ రెడ్డి ఖండించారు. నారాయణ స్వామి సీనియర్ నాయకుడని, జగన్ మోహన్ రెడ్డికి ఆయనపై మంచి అభిప్రాయం ఉందని, ఆయన నిజాయితీపరుడని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tadepalli Iocl Small Can Filling Plant,ఆ ప్లాంట్ తరలించొద్దు.. వైసీపీ విజ్ఞప్తి.. కేంద్రానికి లేఖ.. – ysrcp mp gurumoorthy letter to centre over tadepalli iocl small can filling plant relocation proposal

11 April 2026

Power Cuts In Andhra Pradesh,రోజుకు 5 నుంచి 10 గంటలు కరెంట్ కట్.. ఇలా అయితే ఎలా ? స్క్రీన్ షాట్లతో సహా మంత్రికి ట్వీట్ చేసిన నెటిజన్ – netizen from eluru district complaining that power cuts to minister gottipati ravikumar through tweet

11 April 2026

వైసీపీ అధినేత జగన్‌ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?

11 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

ఎండలు పెరుగుతున్న వేళ సరీసృపాలు వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటు ఆహారం, ఇటు చల్లదనాన్ని వెతుక్కుంటూ నివాస ప్రాంతాల్లోకి…

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే 100 శాతం పక్కా రిజల్ట్

11 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025491

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025441

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.