Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Crime: తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్

14 April 2026

కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి సంబరం.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు !

14 April 2026

Akshaya Tritiya 2026: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Weather Update,Heatwave Alert: 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు.. జర జాగ్రత్త.! – apsdma weather update severe heatwave alert for 51 mandals on monday in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ap Weather Update,Heatwave Alert: 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు.. జర జాగ్రత్త.! – apsdma weather update severe heatwave alert for 51 mandals on monday in andhra pradesh

.By .12 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Weather Update,Heatwave Alert: 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు.. జర జాగ్రత్త.! – apsdma weather update severe heatwave alert for 51 mandals on monday in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం 53 మండలాలలో తీవ్రవడగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలలో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది.

heatwave
51 మండలాల్లో తీవ్రవడగాలులు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు.. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఎండ వేడిమికి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం 51 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే మంగళవారం రోజున 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

వచ్చే రెండు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు ఆదివారం రోజున కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాల రూరల్ మండలంలో 42.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరోవైపు ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క మండలానికి కూడా తీవ్రవడగాలుల హెచ్చరికను జారీ చేయలేదు. కానీ సోమవారం నాటికల్లా 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం నాటికి 53 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని.. బయటకు వెళ్లే సమయంలో టోపీలు, రుమాలు ధరించాలని సూచించారు. అలాగే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన నెలకొంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి