Andhra Pradesh National Highway 216 Kathipudi TO Ongole Expansion Tenders: ఏపీలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సంబంధించి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. కొత్త నేషనల్ హైవేలతో పాటుగా గతంలో ఉన్న హైవేలను విస్తరించనున్నారు. ఈ క్రమంలో మరో జాతీయ రహదారి విస్తరణకు సిద్ధమయ్యారు.. ఈ మేరకు డీపీఆర్ కోసం కన్సల్టెంట్ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించారు. ఈ 216 హైవేను నాలుగు, ఆరు లైన్లుగా విస్తరించనున్నారు.
హైలైట్:
- ఏపీలో మరో జాతీయ రహదారి విస్తరణ
- డీపీఆర్ కోసం కన్సల్టెంట్ కోసం టెండర్లు
- ఈ హైవేను నాలుగు, ఆరు లైన్లుగా విస్తరణ

ఈ హైవేలో కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కిలో మీటర్లు హైవేను విస్తరణ చేయాలని డీపీఆర్ కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. జనవరి 8 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. డీపీఆర్ కోసం ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ 18 నెలల్లో డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశలో మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు 161 కిలో మీటీర్ల విస్తరణకు డీపీఆర్ కోసం కన్సల్టెంట్ ఎంపిక కోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ మేరకు డీపీఆర్లు పూర్తయితే కేంద్రం నుంచి నిధులు కేటాయించనున్నారు.
ఆకివీడు-దిగమర్రు నేషనల్ హైవే విస్తరణ పనులు మూడేళ్లుగా కోర్టు కేసు కారణంగా ఆగిపోగా.. అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్త ఎలైన్మెంట్తో బైపాస్కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ రహదారి 165 పామర్రు-ఆకివీడు-దిగమర్రు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పామర్రు-ఆకివీడు మధ్యం 64 కిలోమీటర్లు రెండు లైన్లుగా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ విస్తరణలో భాగంగానే.. భీమవరానికి ఎడమవైపు 18 కిలో మీటర్ల బైపాస్తో ఎలైన్మెంట్ రూపొందించారు.. కానీ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ బైపాస్తో పాటుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. ప్రతి ఏటా నిధులు మంజూరవుతున్నా ఎలైన్మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటి వరకు పురోగతి లేకుండా పోయింది. తాజాగా ఈ బైపాస్కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విస్తరణపై ఫోకస్ పెట్టారు. రాజమహేంద్రవరం-రంపచోడవరం జాతీయ రహదారిని రెండు వరుసలుగా విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. మొత్తం మీద ఈ హైవే విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.