చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. రెడ్మీ ఏ3ఎక్స్ పేరుతో ఈ ఫోన్ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ను లాంచ్ చేయడం విశేషం.
ధర విషయానికొస్తే రెడ్మీ ఏ3ఎక్స్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6999కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించారు. షావోమీ ఇండియా వెబ్సైట్తో పాటు, అమెజాన్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, అలీవ్ గ్రీన్, స్టారీ వైట్ కలర్ ఆప్షన్స్లో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్లో 6.71 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఎల్సీడీ డాట్ డ్రాప్ స్క్రీన్ను అందించారు. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 720×1650 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ర్యామ్ను వర్చువల్గా 8 జీబీ వరకు పెంచుకోవచచు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అదించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 10వాట్ల వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.