Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

డెమో బాగుంది మాస్టారూ.! చేపలను కొయ్యడం ఎలా.. వీడియో చూసేయండి..!

3 July 2025

AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

3 July 2025

Ap School Students Monthly Rs 600 Allowance,ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.600 ఇస్తారు, డబ్బులు వచ్చేశాయి – andhra pradesh government school students transport allowance rs 600 monthly for 2025 2026

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: పక్కాగా ఫ్లాన్ చేశారు.. చివరికి ఒక్క ఫోన్ కాల్ డామిట్ కథ అడ్డం తిరిగింది..!
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: పక్కాగా ఫ్లాన్ చేశారు.. చివరికి ఒక్క ఫోన్ కాల్ డామిట్ కథ అడ్డం తిరిగింది..!

.By .18 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: పక్కాగా ఫ్లాన్ చేశారు.. చివరికి ఒక్క ఫోన్ కాల్ డామిట్ కథ అడ్డం తిరిగింది..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ యువతి మరో యువకుడితో ప్రేమయాణం సాగించింది. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైన ఆ జంట, మత్తులో మునిగితేలారు. చివరికి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ తన అన్న, స్నేహితులతో కలసి ప్రియుడిని చంపించేసింది. హత్య చేయడమే కాకుండా, అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఒక్క ఫోన్ కాల్ ఆముగ్గరిని పోలీసులకు పట్టించింది.

ఈ గంజాయి మత్తు హత్యా ప్రేమ కథాచిత్రమ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. మలికిపురం మండలం గుడిమెళ్ళంకు చెందిన రాపాక ప్రశాంతికి గత సంవత్సరం డిసెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్తను వదిలేసిన ప్రశాంతి, మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్ తో ప్రేమాయణం సాగించింది. తన తండ్రి జాబ్ నిమిత్తం కాకినాడలో ఉండే జార్జ్, మలికిపురంలోని తన ఇంటి వస్తూ ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నే నోయల్ జార్జ్, ప్రశాంతి ఇద్దరూ గంజాయి, డ్రగ్స్ ఇంజక్షన్లకు బానిసలయ్యారు. ఇదే ఇద్దరిని మరింత దగ్గర చేసింది. భర్తతో విడిపోయిన ప్రశాంతి, గత డిసెంబర్ నుండి జార్జ్‌తో సహజీవనం మొదలుపెట్టింది.

ఇదిలావుండగా, ఇటీవల ప్రశాంతికి జార్జ్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. గంజాయి, డ్రగ్స్ మత్తులో నోయల్ జార్జ్ తనను చిత్ర హింసలకు గురిచేస్తూ హింసిస్తున్నాడ‌ని తన అన్న ప్రకాష్‌కు చెప్పింది ప్రశాంతి. చెల్లిని హింసిస్తున్నాడ‌ని కోపంతో రగిలిపోయిన ప్రకాష్ నోయల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రశాంతితో కలిసి పక్కా ఫ్లాన్ వేసి జార్జ్‌ను రప్పించి హతమార్చారు.

ప్రశాంతితో నోయల్ జార్జ్‌కు ఫోన్ చేయించాడు ప్రకాష్. ప్రశాంతి వద్దకు రప్పించారు. అప్పటికే నోయల్ హత్యకు పధకం వేసుకున్న రాపాక ప్రశాంతి, రాపాక ప్రకాష్, అతని స్నేహితుడు ఎర్రంశెట్డి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేశారు. గాయాలతో పారిపోతున్న నోయల్ ను వెంటపడి మరోసారి కొట్టారు. కొనఊపిరితో ఉన్న అతన్ని దిండి-చించినాడ బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి తోసేశారు. అంతే కాకుండా నోయల్ జార్జ్ బైక్, చెప్పులు బ్రిడ్జి వద్ద ఉంచి, ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు నిందితులు అక్కడి నుండి పారిపోయిన ముగ్గురు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

నోయల్ జార్జ్ తనను హింసించి కొట్టి పారిపోయాడంటూ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది ప్రశాంతి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇనుప రాడ్ల దాడిలో గాయపడి పారియే సమయంలో నోయల్ జార్జ్ తన తండ్రి కి కాల్ చేసి ప్రమాదంలో ఉన్నానంటూ సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన తరువాత రోజు నోయల్ జార్జ్ తండ్రి రత్నరాజు మలికిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. అయితే హత్య జరిగిన రెండు రోజులకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం సముద్ర తీరంలో నోయల్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, నోయల్ శరీరంపై ఉన్న గాయాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో మర్డర్ కేసుగా నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap School Students Monthly Rs 600 Allowance,ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.600 ఇస్తారు, డబ్బులు వచ్చేశాయి – andhra pradesh government school students transport allowance rs 600 monthly for 2025 2026

3 July 2025

Bjp Mp Laxman On Ttd,ఆ అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా.. తెలంగాణకు చెందిన ఎంపీ కీలక వ్యాఖ్యలు – bjp mp laxman sensational comments on ttd board in ysrcp government at tirumala

3 July 2025

చేపల వేటకు వెళ్లాడు.. కట్ చేస్తే.. వల బరువెక్కడంతో సరాసరి నీటిలోకే.. ఆ తర్వాత!

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

డెమో బాగుంది మాస్టారూ.! చేపలను కొయ్యడం ఎలా.. వీడియో చూసేయండి..!

3 July 2025

ఆయన ఓ జిల్లా కలెక్టర్.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ తాఖీదులు ఇస్తుంటారు. సిబ్బంది పనితీరును తెలుసుకుంటూ…

AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

3 July 2025

Ap School Students Monthly Rs 600 Allowance,ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.600 ఇస్తారు, డబ్బులు వచ్చేశాయి – andhra pradesh government school students transport allowance rs 600 monthly for 2025 2026

3 July 2025

Video: వామ్మో.. లింగ మార్పిడి ఆపరేషన్‌కు అంత ఖర్చా.? కన్నీళ్లు పెట్టుకున్న అనయ

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

డెమో బాగుంది మాస్టారూ.! చేపలను కొయ్యడం ఎలా.. వీడియో చూసేయండి..!

3 July 2025

AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

3 July 2025

Ap School Students Monthly Rs 600 Allowance,ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.600 ఇస్తారు, డబ్బులు వచ్చేశాయి – andhra pradesh government school students transport allowance rs 600 monthly for 2025 2026

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.