Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo

10 July 2025

Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారి రాశిఫలాలు

10 July 2025

Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో

9 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Tidco Housing Scheme,ఏపీలో ఆ ఇళ్ల పనుల్లో కదలిక.. గృహ ప్రవేశాలకు రెడీ అయిపోవడమే.. జూన్ 12న.. – ap government ordered completion of the incomplete tidco houses in narsipatnam by june 12
ఆంధ్రప్రదేశ్

Ap Tidco Housing Scheme,ఏపీలో ఆ ఇళ్ల పనుల్లో కదలిక.. గృహ ప్రవేశాలకు రెడీ అయిపోవడమే.. జూన్ 12న.. – ap government ordered completion of the incomplete tidco houses in narsipatnam by june 12

.By .13 April 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Tidco Housing Scheme,ఏపీలో ఆ ఇళ్ల పనుల్లో కదలిక.. గృహ ప్రవేశాలకు రెడీ అయిపోవడమే.. జూన్ 12న.. – ap government ordered completion of the incomplete tidco houses in narsipatnam by june 12
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నర్సీపట్నంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2018లో మంజూరైన 2,592 ఇళ్లలో చాలా వరకు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం చొరవతో పనులు వేగవంతమయ్యాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాల్సి ఉంది. రుణాల సమస్యతో బాధపడుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం చేయనుంది.

Samayam Teluguగృహప్రవేశాలకు ప్రణాళిక.. సీఎం కీలక నిర్ణయం..
గృహప్రవేశాలకు ప్రణాళిక.. సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు నిర్మిస్తున్న గృహ సముదాయాలు త్వరలోనే లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని గట్టిగా ఆదేశించడంతో పనులు వేగవంతమయ్యాయి. వాస్తవానికి.. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల కోసం 2,592 ఇళ్లను మంజూరు చేయడంతో ప్రారంభమైంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం , బయ్యపురెడ్డిపాలెం ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 1,824 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, దాదాపు 80 శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయి. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యం లభించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించి.. మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాల్సినప్పటికీ.. పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. ఆ సమయంలో.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడిగా 1,156 మంది లబ్ధిదారులకు కేవలం తాళాలు మాత్రమే అందజేశారు. కనీస మౌలిక వసతులు కూడా లేని ఇళ్లకు తాళాలు ఇస్తే ఎలా నివసించగలమని లబ్ధిదారులు తీవ్రంగా ప్రశ్నించారు. కొద్ది రోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేస్తామని అప్పటి పాలకులు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.

తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. లబ్ధిదారుల ఆవేదనను గుర్తించిన ప్రభుత్వం, వెంటనే చర్యలు చేపట్టింది. మూడు రోజుల క్రితం రాష్ట్ర స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్లతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించి.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించారు.

ఏపీలో ఆ ఇళ్ల పనుల్లో కదలిక.. గృహ ప్రవేశాలకు రెడీ అయిపోవడమే.. జూన్ 12న..

గృహ సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా.. తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు చేయలేదు. సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి.. పైపులైన్లు వేసి నీటిని అందించాల్సి ఉంది. సీసీ రోడ్ల నిర్మాణం కేవలం పది శాతం మాత్రమే పూర్తయింది. డ్రైనేజీ వ్యవస్థ పనులు సగం వరకే జరిగాయి. సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం 60 శాతం, విద్యుత్ పనులు కేవలం 25 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ పనులన్నింటినీ నూరు శాతం పూర్తి చేయడానికి అధికారులు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

గతంలో బ్యాంకుల నుండి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తూ, మరోవైపు సిద్ధంకాని ఇళ్లకు బ్యాంకు వాయిదాలు చెల్లించడం వారికి భారంగా మారింది. ఈ సమస్యను నర్సీపట్నం శాసన సభ్యులు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బ్యాంకులకు చెల్లించాల్సిన అపరాధ రుసుమును ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు ఆర్థికంగా ఊరట కలిగించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి నుండి సానుకూల స్పందన వస్తుందని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు.. ఇళ్లు మంజూరైనప్పటికీ వివిధ కారణాల వల్ల 341 మంది లబ్ధిదారులకు బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాలేదు. వారిలో కొందరు రుణ అర్హత కోల్పోవడం, వయో పరిమితి దాటడం లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాలను అధికారులు గుర్తించారు. వీరందరికీ అధికారులు నోటీసులు జారీ చేసి.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సొంతంగా డబ్బులు వెచ్చించి ఇళ్లు పూర్తి చేసుకుంటారా.. కుటుంబంలో సంపాదన కలిగిన మరొకరిని చేర్చుకుంటారా లేదా ఇల్లు వద్దనుకుంటున్నారా అని అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వారి సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ ఏమైనా ఇళ్లు మిగిలిపోతే.. అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించే అవకాశం కూడా ఉంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం పేదల సొంతింటి కలను త్వరలోనే నిజం చేస్తుందని లబ్ధిదారులు విశ్వసిస్తున్నారు.

బూరుగడ్డ వీరబాబు

రచయిత గురించిబూరుగడ్డ వీరబాబుబూరుగడ్డ వీరబాబు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ విభాగాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, బిజినెస్, టెక్నాలజీ, విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo

10 July 2025

Husband And Wife Thefts,మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! – pendurthi police arrest husband and wife for stealing gold from shops

9 July 2025

Simhachalam: వైభవంగా అప్పన్నగిరి ప్రదక్షిణ.. భక్తులతో కిక్కిరిసిన సింహగిరి రహదారులు .. 32 కి.మీ. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు..

9 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo

10 July 2025

Tirumala Big Janata Canteens: తిరుమలలో భక్తుల కోసం బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహారం అందించాలని టీటీడీ ఈవో…

Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారి రాశిఫలాలు

10 July 2025

Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో

9 July 2025

Husband And Wife Thefts,మొగుడూ పెళ్లాం.. ఓ దొంగాట, చివరకు పాపం! – pendurthi police arrest husband and wife for stealing gold from shops

9 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tirumala Quality Food Must,తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఫుడ్, టీటీడీ కీలక ఆదేశాలు – quality food must be served in big and janata canteens to tirumala devotees says ttd eo

10 July 2025

Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారి రాశిఫలాలు

10 July 2025

Dil Raju : సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి.. పూర్తి వివరాలు ఇదిగో

9 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.