Andhra Pradesh Mid Day Meals In Summer Vacation: ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం అందించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం విద్యార్థులకు పోషకాహారం పొందే హక్కు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో తెలిపారు. సెలవుల్లోనూ పథకం కొనసాగించాలని కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది.
హైలైట్:
- ఏపీలో వేసవిలోనూ మధ్యాహ్న భోజనం
- ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వ్యక్తి
- ఆ ఐదు జిల్లాల్లోనే అమలు చేయాలని

రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 16న ఒక జీవో విడుదల చేసిందని.. ఆ జీవో ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లోని 87 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘పీఎం పోషణ్’ పథకం కింద మధ్యాహ్న భోజనం అందించడం లేదని కోర్టుకు పిటిషన్లో వివరించారు. అందుకే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల విద్యాధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరానని.. వారు సమాధానం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. 2024 మే నెలలో (వేసవి సెలవుల్లో) మధ్యాహ్న భోజనం అమలు చేయలేదని.. కరువు ప్రాంతాల్లో అమలు చేయాలనే నిబంధన లేదని అధికారులు తెలిపారన్నారు.
ఏపీలో వేసవి సెలవుల్లో కూడా ఈ ఐదు జిల్లాల్లోని స్కూల్, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. కీలక అంశాలివే
2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేయకపోవడం ‘పీఎం పోషణ్’ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో ప్రస్తావించారు. వేసవి సెలవులు దగ్గర పడుతున్నందున.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కరువు ప్రాంతాల్లోని స్కూల్, కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. త్వరలో సెలవులు రానున్నాయి కాబట్టి.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు పిటిషనర్. మరి ఏపీ మైకోర్టు మధ్యాహ్న భోజనం అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది చూడాలి.