ఎండాకాలం వచ్చేసింది. వేడిగాలులు, ఉక్కబోత మొదలైంది. కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వడగాలుల ప్రభావం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మంచినీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో పెరుగుతున్న నిమ్మకాయ ధరలు.. వినియోగదారుణ్ని భయపెడుతున్నాయి. అయితే నిమ్మరైతులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఏపీలో గత కొన్ని వారాలుగా నిమ్మకాయ రేటు 4 రెట్లు పెరిగిందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నిమ్మకాయకు డిమాండ్ పెరిగింది. దీంతో గత కొన్ని వారాలుగా ఏపీలో నిమ్మకాయ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నిమ్మకాయ ధరలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో నిమ్మకాయల ఉత్పత్తి ఎక్కువ. దీంతో నిమ్మ రేట్లు పెరగటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వినియోగదారుడే షాక్ తింటున్నాడు. మార్చి నెలలో క్వింటాల్ నిమ్మ ధర రూ.3000లుగా ఉండేది. ఏప్రిల్ వచ్చే సరికి క్వింటా నిమ్మకాయ రేటు రూ.12000కు చేరుకుంది. నాలుగే వారాల్లో ఏకంగా 400 శాతం పెరిగిపోయింది.
కారు ఉండగానే రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్.. కారణం తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే!
గుంటూరు జిల్లా దుగ్గిరాల నిమ్మకాయల మార్కెట్ నుంచి నిమ్మ ఎగుమతులు ఎక్కువ. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్తో ఎగుమతిదారులు నిమ్మకాయ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మార్చి నెల మొదటి వారంలో క్వింటాల్ రూ.3000 ఉండే నిమ్మకాయ రేటు.. మార్చి మూడో వారానికి రూ.6000లకు చేరుకుంది. గత కొన్నివారాలుగా ఈ ధర రూ.12000లకు చేరుకుంది. అంతర్జాతీయంగా నిమ్మ ఎగుమతుల్లో భారతదేశం వాటా 18 నుంచి 20 శాతం వరకూ ఉంటుంది.
Lemon Price: నిమ్మకు టైమొచ్చింది.. కొండెక్కి కూర్చుంది.. ఏకంగా 400 శాతం!
అయితే యూఎస్ టారిఫ్ల ప్రభావం నిమ్మ మీద పడలేదు. ఎందుకంటే భారత్ నుంచి కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, నేపాల్ వంటి దేశాలకు నిమ్మ ఎగుమతులు ఎక్కువ. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా నిమ్మ పంట దెబ్బతినడం కూడా.. ఏపీలో నిమ్మకాయ రేట్లు పెరగడానికి కారణం కావొచ్చని వ్యాపారులు చెప్తున్నారు.