అందంగా కనిపించాలని ఓ మహిళ బ్యూటీపార్లర్కు వెళ్లి ఫెషియల్ చేయించుకుంది. కానీ, అది భర్తకు నచ్చలేదు. అసలు నువ్వు బ్యూటీ పార్లర్కు ఎందుకు వెళ్లావంటూ భార్యతో అతను గొడవ పెట్టుకున్నాడు. నేను వెళ్తాను నా ఇష్టం, అయినా అందంగా ఉంటే తప్పా, నేను ఫెషియల్ చేయించుకుంటే నీకేంటి అంటూ ఆమె భర్తకు ఎదురుతిరిగింది. ఇద్దరి మధ్య ఇదే విషయంలో మాటా మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. ఇలా కాదు.. ఆమె బుద్ధి చెప్పాల్సిందే అని ఆ భర్త కాస్త మొండిగా ప్రవర్తించాడు. భార్యను కొట్టి.. ఆమె పొడవాటి జట్టు కత్తిరించేశాడు. అది కూడా ఆమె తల్లిదండ్రుల ముందే చేశాడు. ఆ తర్వాత అతని అత్తామామలు అతనిపై కేసు పెట్టారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్ధోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాంప్రతాప్ అనే వ్యక్తి తన భార్య బ్యూటీపార్లర్లో ఫెషియల్ చేయించుకుందని ఆగ్రహంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమే గాక అత్తామామల ముందే భార్య జుట్టును కత్తితో కత్తిరించి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం రాంప్రతాప్పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తమ అల్లుడు అదనపు కట్నం కోసం కూతురిని వేధిస్తున్నాడని ఇందులో భాగంగానే ఈ రోజు తమ కుమార్తెతో కావాలని గొడవకు దిగి ఆమె జుట్టు కత్తిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.