జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు మరణించారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘ఐ లవ్ యూ నాన్న.. మిస్ యూ నాన్న.. నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండు నాన్న’ కుమారుడు దత్తు కంటతడి పెట్టిన తీరు అక్కడున్న వారందరినీ కదిలించాయి. మధుసూదన్ తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకున్నా ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. వారికి ఇద్దరు కుమార్తెల తర్వాత మధుసూదన్ పుట్టారు. తల్లిదండ్రులు ఇద్దరూ హార్ట్ పేషెంట్స్ కావడంతో వీరి బాగోగులను మధుసూదనే చూసుకుంటున్నారు. మధుసూదన్ మృతి చెందారనే సమాచారాన్ని భౌతికకాయం తీసుకొచ్చేంత వరకు తల్లిదండ్రులకు చెప్పలేదు. మధుసూదన్ తండ్రి తిరుపాలుకు ఇటీవల హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. తమ కుమారుడు మృతి చెందాడనే విషయం తెలియక బుధవారం ఉదయం కూడా అతడి తండ్రి అరటిపళ్ల బండి వద్ద వ్యాపారం చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. ఎప్పటిలాగే కొడుకు తమను చూడటానికి వస్తాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కొడుకు మృతదేహాన్ని చూడగానే నిశ్చేష్టులయ్యారు. మధుసూదన్ అంత్యక్రియల్లో ఏపీ మంత్రులు పాల్గొన్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
.