
టీవీ9 ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిలో ఓ అపరిచితుడు ఉన్నాడని అన్నారు. ఈయన బయట రాములా..లోపల రెమోలా ఉంటాడన్నారు. బయటనేమో మాకు అప్పుపుట్టట్లేదని.. మమ్మల్ని ఎవరూ నమ్మట్లేదని అంటారు.. కానీ అసెంబ్లీలో మాత్రం తాము లక్షా 58 వేల కోట్ల అప్పు చేశామంటారు. మళ్లీ బడ్జెట్లో మాత్రం తెలంగాణ మిగులు రెవెన్యూ స్టేట్ అని చూపిస్తారు అని ఆయన అన్నారు. తాము పదేళ్లలో చేసిన అప్పు 4.17లక్షల కోట్లు అని కేటీఆర్ చెప్పారు. తాము చేసిన అప్పుతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బాగు చేశామని. ఇంటింటికి మంచినీళ్లు అందించామన్నారు. రేవంత్ ప్రభుత్వం లక్షా 60వేల కోట్లు అప్పు చేసి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.