Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, పునర్విభజన చట్టంలోనూ పేరు మార్పునకు ఆమోదం తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించగా, మున్సిపల్ శాఖకు సంబంధించిన 281 పనులకు అనుమతి లభించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీకలక నిర్ణయాలు
- తల్లికి వందనం పథకంపైనా అప్డేట్
- అన్నదాత సుఖీభవ పథకంపై నిర్ణయం

దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం, తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే ఏపీలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేబర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 2019లో గత ప్రభుత్వం ఆమోదించి.. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు తెలపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరినట్లు తెలుస్తోంది.
ఏపీలో రైతులకు రూ.20 వేలు, తల్లికి వందనంపైనా అప్డేట్.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
మరోవైపు ఆపరేషన్ సిందూర్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనికేత్ అని అభివర్ణించారు.. అనికేత్ ఒక పేరు, ఒక సంకల్పమన్నారు. అనికేత్ అంటే ఇళ్లు లేకుండా అని అర్ధం అని చెప్పుకొచ్చారు. అనికేత్ అనేది శివుడికి కూడా ఒక పేరు. విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు, అయినప్పటికీ అతనికి స్వంత ఇల్లు లేదు. నేడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా భావించిన అదే ‘అనికేత్’. తాను నిరాశ్రయుడైనా ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద కోట్లాది మందికి ఇళ్లను అప్పగించాడు’ అన్నారు.