Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!

18 May 2025

ప్రధాని మోదీ నివాసానికి ప్యామిలీతో మంత్రి లోకేష్.. కుమారుడు దేవాన్ష్‌తో మోదీ సరదా సంభాషణ

18 May 2025

ఇదేం దరిద్రం భయ్యా.. 17 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్ చేరని RCB.. మరోసారి రిపీటైతే ఐపీఎల్ నుంచి ఔట్?

18 May 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Muppavarapu Veeraiah Chowdary Murder Case,టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు – prakasam district police arrested 9 accused in tdp leader muppavarapu veeraiah chowdary murder case
ఆంధ్రప్రదేశ్

Muppavarapu Veeraiah Chowdary Murder Case,టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు – prakasam district police arrested 9 accused in tdp leader muppavarapu veeraiah chowdary murder case

.By .15 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Muppavarapu Veeraiah Chowdary Murder Case,టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు – prakasam district police arrested 9 accused in tdp leader muppavarapu veeraiah chowdary murder case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Veeraiah Chowdary Murder Case Accused Arrested: టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

హైలైట్:

  • టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ వీడింది
  • ఈ కేసులో 9మందిని అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు
  • సంచలన విషయాలు చెప్పి జిల్లా ఎస్పీ దామోదర్
వీరయ్య చౌదరి హత్యకేసు
వీరయ్య చౌదరి హత్యకేసు (ఫోటోలు– Samayam Telugu)

టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరిని ఏప్రిల్ 22న సాయంత్రం 7.30 గంటలకు ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాల కారణంగా ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించారని.. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశామని ఈ హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఆర్.దామోదర్ వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన కారణం అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరేనని తెలిపారు. ఈ కేసులో ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. రాజకీయ కక్షలతో పాటు ఇసుక వ్యవహారంలో అమ్మనబ్రోలుకు చెందిన సాంబయ్యకు, వీరయ్య చౌదరికి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ఈ హత్యకు ముందు నిందితులు మూడుసార్లు రెక్కీ నిర్వహించగా.. ఆ తర్వాత ఏప్రిల్ 22న వీరయ్య చౌదరిని హత్య చేశారన్నారు. ఈ కేసులో బోర్లగుంట వినోద్ కుమార్, తువ్వర వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మార్టూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబయ్య, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావులను అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 7 మొబైల్స్, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.

‘వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన సూత్రధారి ఆళ్ల సాంబయ్య అలియాస్‌ సిద్ధాంతి. అమ్మనబ్రోలు గ్రామంలో అధిపత్యపోరే హత్యకు ప్రధాన కారణం. రాజకీయ కక్షలతో పాటు ఇసుక వ్యవహారంలోనూ సాంబయ్యతో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో కిరాయి వ్యక్తుల సాయంతో వీరయ్యచౌదరిని హతమార్చారు’ అని ఎస్పీ తెలిపారు. ‘అలాగే ఒంగోలుకు చెందిన బోర్లగుంట వినోద్ కుమార్‌కు ఒంగోలులో మూడు సెలూన్లు ఉన్నాయి. టిప్పర్లతో నెల్లూరుతో పాటు నాగులుప్పలపాడులోని కనపర్తి ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేసేవాడు. అతనికి నెల్లూరులోని రౌడీలతో పరిచయాలు ఉన్నాయి. అమ్మనబ్రోలులో ఎరువుల దుకాణం నిర్వహించే తోట శ్రీనివాసరావుతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. శ్రీనివాసరావు ద్వారా ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి వినోద్‌ను కలిశాడు’ అని ఎస్పీ వివరించారు.

‘వినోద్ నేర చరిత్ర గురించి తెలుసుకున్న సిద్ధాంతి అతన్ని హైదరాబాద్ తీసుకెళ్లి తన మేనల్లుడు ముప్పా సురేష్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత వీరయ్య హత్యకు పథకం వేశారు. వినోద్‌కు వీరయ్యతో నేరుగా పరిచయం లేదు. ఇసుక అక్రమ రవాణాపై వీరయ్య ఫిర్యాదు చేయడంతో అధికారులు వినోద్ వాహనాలు పట్టుకుని రూ.25 వేలు జరిమానా విధించారు. ఆ డబ్బును సిద్ధాంతి చెల్లించాడు. నెల్లూరుకు చెందిన గోళ్ల రుత్యేంద్రబాబు అలియాస్‌ నాని ద్వారా కిరాయి హంతకులను ఏర్పాటు చేసి వీరయ్యను హత్య చేయించడంలో వినోద్ కీలక పాత్ర పోషించాడు’ అన్నారు. ‘ఈ కేసులో అరెస్టైన షేక్ సమీర్ ఈ కేసులో నిందితుడు.. వినోద్ సెలూన్‌లో పని చేసేవాడు. హత్యకు ప్రణాళిక రచించడానికి నిందితులకు భోజనం, వసతి ఏర్పాటు చేశాడు. తన స్నేహితుడి ద్వారా వారికి ఒక ద్విచక్ర వాహనాన్ని ఏర్పాటు చేశాడు’ అన్నారు.

‘అమ్మనబ్రోలుకు చెందిన ఆళ్ల సాంబశివరావు అలియాస్‌ సాంబయ్య అలియాస్ సిద్ధాంతి.. తన మేనల్లుడు ముప్పా సురేష్‌తో కలిసి 2011-12 నుంచి వీరయ్య వర్గంలో ఉండేవాడు. 2021లో అమ్మనబ్రోలు సర్పంచ్ ఎన్నికల్లో వీరయ్య ప్యానెల్‌కు పోటీగా వేరొకరిని సర్పంచి అభ్యర్థిగా నిలిపి డబ్బులతో గెలిపించుకున్నాడు. ముప్పవరపు వీరయ్య చౌదరి రాజకీయంగా ఎదుగుతుండటంతో తనకు, తన మేనల్లుడికి భవిష్యత్తు ఉండదని భావించాడు. ఈ క్రమంలోనే ఎరువుల షాపు నిర్వహించే తోట శ్రీనివాసరావు ద్వారా ఒంగోలుకు చెందిన వినోద్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. వీరయ్య హత్య కోసం రెండు దఫాలుగా రూ.10 లక్షలు చొప్పున రూ.20 లక్షలు చెల్లించాడు. ఈ హత్య చేసిన తర్వాత అన్ని నేను చూసుకుంటామని నమ్మబలికి కిరాతకానికి ఒప్పించాడు.. ఇలా రోజూ వినోద్‌పై సాంబయ్య ఒత్తిడి చేస్తూ హత్య చేయించాడు’ అని ఎస్పీ వివరించారు.

‘ఎరువుల వ్యాపారం చేసే తోట శ్రీనివాసరావు ద్వారా వినోద్‌కు, ఆళ్ల సాంబయ్యకు మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత ముప్పా సురేష్‌ను కూడా కలిశారు.. వీరు కొన్ని సెటిల్‌మెంట్లు నిర్వహించాడు. తోట శ్రీనివాసరావు వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా ఉన్నాడు. ఏప్రిల్ 22న వీరయ్య తన కార్యాలయానికి వచ్చిన విషయాన్ని హంతకులకు సమాచారం అందించాడు. ఈ కేసులో హంతకుల కోసం ఏర్పాటు చేసిన స్కూటీలో డబ్బులు పెట్టి బుల్లెట్ షోరూం దగ్గర నిలిపి ఉంచాడు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి వీరయ్య చౌదరితో రొయ్యల చెరువులు, ఇతర వ్యాపార విషయాల్లో విభేదాలు ఉన్నాయి. అయితే వీరయ్యను హత్య చేయబోతున్నట్లు తెలిసి కూడా చెప్పలేదు. హత్యలో అతనికి ప్రమేయం లేకపోయినా గోప్యంగా ఉంచినందున నిందితుడయ్యాడు’ అన్నారు.

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

‘ఈ హత్యకేసులో నిందితుడు మార్టూరి కిరణ్ కుమార్‌ది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.. వినోద్‌కు బంధువు. వీరయ్య హత్య ప్లాన్‌లో భాగం ఉంది.. ఈ హత్య తర్వాత వినోద్‌కు షెల్టర్, నిందితులకు బెయిల్ కోసం లాయర్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. మరో ముద్దాయి ముప్పా సురేష్ ఆళ్ల సాంబయ్యకు మేనల్లుడు. సాంబయ్య, తోట శ్రీనివాసరావు ద్వారానే అతడికి వినోద్ పరిచయమయ్యాడు. వీరయ్య హత్య విషయం సురేష్‌కు తెలుసు. ఈ హత్యకేసులో నిందితులు తువ్వర వంశీకృష్ణ అలియాస్‌ జల్సా వంశీ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, నాగరాజు వీరంతా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. వీరు నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులు. ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు. నెల్లూరుకు చెందిన గోళ్ల రుత్రేంద్రబాబు అలియాస్‌ నాని వీరిని వినోద్‌కు పరిచయం చేశాడు’ అని ఎస్పీ వివరించారు. ఈ కేసులో పరారీలో ఉన్నవారిని పట్టుకుంటామన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!

18 May 2025

Indian Railways Announced Special Trains,రైల్వే కొత్త ప్యాకేజీలు వచ్చేశాయ్.. మే 22 నుంచే ప్రారంభం.. – indian railways announced special trains with exclusive packages for pilgrims

18 May 2025

AP EAPCET 2025 Exam Day Guidelines: రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు!

18 May 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!

18 May 2025

అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలంవారిపల్లి సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే…

ప్రధాని మోదీ నివాసానికి ప్యామిలీతో మంత్రి లోకేష్.. కుమారుడు దేవాన్ష్‌తో మోదీ సరదా సంభాషణ

18 May 2025

ఇదేం దరిద్రం భయ్యా.. 17 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్ చేరని RCB.. మరోసారి రిపీటైతే ఐపీఎల్ నుంచి ఔట్?

18 May 2025

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో

18 May 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వంట పనికోసం వచ్చారు.. పెళ్లి వారి ఇంటికి చేరుకోక ముందే..!

18 May 2025

ప్రధాని మోదీ నివాసానికి ప్యామిలీతో మంత్రి లోకేష్.. కుమారుడు దేవాన్ష్‌తో మోదీ సరదా సంభాషణ

18 May 2025

ఇదేం దరిద్రం భయ్యా.. 17 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్ చేరని RCB.. మరోసారి రిపీటైతే ఐపీఎల్ నుంచి ఔట్?

18 May 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025136
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.