Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kingdom Twitter Review: కింగ్‏డమ్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

31 July 2025

Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral

31 July 2025

Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ పశ్చాత్తాపం..

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. సాయం చేస్తామని సీఎంలకు హామీ ఇచ్చిన పీఎం..
ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. సాయం చేస్తామని సీఎంలకు హామీ ఇచ్చిన పీఎం..

.By .2 September 2024No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. సాయం చేస్తామని సీఎంలకు హామీ ఇచ్చిన పీఎం..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా, వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

పరిస్థితిపై ముఖ్యమంత్రుల ఫోకస్..

బుడ్మేరు వాగు పొంగడంతో పరిస్థితి దారుణంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు, పైకప్పులపై చిక్కుకుపోయారు. ప్రతి గంటకూ పరిస్థితిని గమనిస్తూనే ఉంటామని, పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం బుడ్మేరు కాలువను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ విపత్తు సంభవించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

‘ప్రజలకు సహాయం అందిస్తాం’

ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సీఎంలు తెలిపారు. బోట్ల ద్వారా ప్రజలకు ఆహారంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తామని వారు తెలిపారు. వైద్య సహాయం అవసరమైన వారిని తరలించేందుకు పడవలను కూడా ఉపయోగిస్తామని, ప్రభుత్వం ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లను అందిస్తోందని, మొత్తం కార్యాచరణను పర్యవేక్షిస్తానని సీఎంలు తెలిపారు. మరిన్ని బోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పిస్తామని వారు తెలిపారు.

సాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ..

అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని షా రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత రాష్ట్రాల సీనియర్ అధికారులతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను రంగంలోకి దించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటి వరకు 9 మంది మృతి..

వర్షాభావ ప్రాంతాల నుంచి తరలించిన ప్రజల కోసం ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 100 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 61 వైద్య శిబిరాల ఏర్పాట్లు కూడా చేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నీట మునిగిన 600 మందిని రక్షించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral

31 July 2025

Ttd Plans On Tirumala Policy Document,తిరుమలలో ఆ రూల్ కఠినంగా అమలు.. శ్రీవారి భక్తులు ఈ విషయం తెలుసుకోండి – ttd plans concrete policy document on ghat road vehicle movement and traffic plan in tirumala

31 July 2025

Director Teja Company Mou With Ap Govt,టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ.. నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ – andhra pradesh government mou with tesseract company in singapore

31 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kingdom Twitter Review: కింగ్‏డమ్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

31 July 2025

టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్‏డమ్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ…

Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral

31 July 2025

Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ పశ్చాత్తాపం..

31 July 2025

Ttd Plans On Tirumala Policy Document,తిరుమలలో ఆ రూల్ కఠినంగా అమలు.. శ్రీవారి భక్తులు ఈ విషయం తెలుసుకోండి – ttd plans concrete policy document on ghat road vehicle movement and traffic plan in tirumala

31 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kingdom Twitter Review: కింగ్‏డమ్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

31 July 2025

Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral

31 July 2025

Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ పశ్చాత్తాపం..

31 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.