Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Counter To Bhumana Comments,తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ – tirumala tirupati devasthanams respond on bhumana karunakar reddy allegations on veda parayana and devootees darshan
ఆంధ్రప్రదేశ్

Ttd Counter To Bhumana Comments,తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ – tirumala tirupati devasthanams respond on bhumana karunakar reddy allegations on veda parayana and devootees darshan

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Counter To Bhumana Comments,తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ – tirumala tirupati devasthanams respond on bhumana karunakar reddy allegations on veda parayana and devootees darshan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Respond To Bhumana Karunakar Reddy Comments: తిరుమల ఆలయంలో సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించగా, టీటీడీ వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. వేద పారాయణానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విమర్శలను తోసిపుచ్చింది. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామని, దర్శనాల్లో పారదర్శకత పెంచామని తెలిపింది. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. అసలు ఏం జరుగుతోంది తిరుమలలో?

హైలైట్:

  • టీటీడీపై భూమన సంచలన ఆరోపణలు
  • కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ క్లారిటీ
  • అవాస్తవాలను నమ్మొద్దన్న టీటీడీ
భూమన వ్యాఖ్యలపై టీటీడీ స్పందన
భూమన వ్యాఖ్యలపై టీటీడీ స్పందన (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వేద పారాయణాన్ని పక్కన పెట్టి.. వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే టీటీడీపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అంటూ టీటీడీ స్పందించింది. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయమంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని.. వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ ప్రెస్‌నోట్‌లో.. ‘ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగింది. శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక – మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం’ అని టీటీడీ తెలిపింది.

అర్చకుల్ని గౌరవిస్తున్నాం

‘అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం. అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి’ అని తెలిపింది టీటీడీ.

పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వలేదు

‘ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది’ అని క్లారిటీ ఇచ్చారు.

భక్తుల దర్శనాల విషయంలోనూ అవాస్తవాలు

‘ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పిభక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది‌. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం. టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని ఏఐ అంశం, భక్తులపై దర్శనాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది.

తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ

పరకామణిలో తనిఖీ

‘2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని టీటీడీ ప్రకటనలో తెలిపింది. వాస్తవాలు పైవిధంగా ఉంటే టీటీడీ మాజీ ఛైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని.. వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నామంది టీటీడీ.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు

20 June 2025

Prakasam district: ఆవుల మంద తిరగబడటంతో తోక ముడిచి తుర్రుమన్న పెద్దపులి

20 June 2025

కొట్లాడితే ఏమొస్తుంది.. కూర్చుని మాట్లాడుకుంటే పోలా.. బేసిన్‌లో నీళ్లకు భేషజాలు ఎందుకు?: సీఎం రేవంత్

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

పేరున్న రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్…

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025

Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

20 June 2025

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.