Pawan Kalyan Speech In Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
హైలైట్:
- విశాఖపట్నంలో యోగాంధ్ర 2025
- హాజరైన ప్రధాని మోదీ, సీఎం బాబు
- యోగసనాలు చేసిన లక్షలాదిమంది

175 దేశాల్లో.. 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు.. ఫిజికల్, మెంటల్ హెల్త్ గా యోగా దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. ఏఐ యోగాను మరింత సులువుగా.. అందరికి దగ్గరగా తీసుకొస్తోందన్నారు. రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. 1.44లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను చెబితే.. ప్రధాని నరేంద్ర మోదీ దానిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు.