Raigad Royals vs Kolhapur Tuskers Eliminator Match MPL 2025: క్రికెట్ ఆటలో ఎన్నో అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నిబంధనలు తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతారు. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) 2025లో రాయ్గఢ్ రాయల్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు పరుగులు తీసే క్రమంలో మైదానం మధ్యలో పడిపోయినప్పటికీ, రనౌట్ కాలేదు. ఇది అభిమానులను, కామెంటేటర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
అసలేం జరుగుతోంది..
ఇవి కూడా చదవండి
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో, రాయ్గఢ్ రాయల్స్ బ్యాట్స్మెన్లు ఇద్దరు ఒక పరుగు కోసం ప్రయత్నించారు. తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు తీసే క్రమంలో ఒకరినొకరు బలంగా ఢీ కొన్నారు. దీంతో ఇద్దరూ ఒకేసారి మైదానం మధ్యలో పడిపోయారు. అప్పటికే ఫీల్డర్ బంతిని వికెట్ల వద్దకు విసిరాడు. బ్యాట్స్మెన్లు పడిపోయినందున, రనౌట్ ఖాయమని అందరూ భావించారు. ఆ సమయంలో, ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. వికెట్ కీపర్ నాన్-స్ట్రైక్ ఎండ్లో బంతిని విసిరి ఒక బ్యాట్స్మన్ను రనౌట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని పట్టుకోలేకపోయాడు. అప్పటికి ఒక బ్యాట్స్మెన్ క్రీజులోకి చేరుకున్నాడు.
ఆ తర్వాత, కొల్హాపూర్ కెప్టెన్ రాహుల్ త్రిపాఠి బంతిని తీసుకొని స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. అతన్ని రనౌట్ చేశాడు. ఆ సమయంలో, మరొక బ్యాట్స్మన్ కూడా పరిగెత్తాడు. రాహుల్ త్రిపాఠి బంతిని వికెట్ వైపు విసిరాడు. కానీ, బంతి వికెట్ తప్పి బౌండరీ దాటింది. మరొక బ్యాట్స్మన్ సురక్షితంగా తన క్రీజుకు చేరుకున్నాడు. ఈ విధంగా, రాయ్గఢ్ రాయల్స్ 5 పరుగులు చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఈ సంఘటనకు సంబంధించి క్రికెట్ నిబంధనలను అర్థం చేసుకోవడం ముఖ్యం. MCC (మెరిల్బోన్ క్రికెట్ క్లబ్) నిబంధనల ప్రకారం, ఒక బ్యాట్స్మెన్ రనౌట్ కావాలంటే, బంతి వికెట్లకు తగిలే సమయంలో అతను తన క్రీజు వెలుపల ఉండాలి. క్రీజు వెలుపల ఉన్నప్పటికీ, ఏదైనా శరీర భాగం లేదా బ్యాట్ క్రీజు లోపల నేలకు తాకి ఉంటే, అతను అవుట్ కాదు.
మ్యాచ్ పరిస్థితి..
ఎలిమినేటర్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కొల్హాపూర్ టస్కర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రాహుల్ త్రిపాఠి విఫలమై రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంకిత్ బవానే అత్యధికంగా 57 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా, రాయ్గఢ్ రాయల్స్ ఈ మ్యాచ్లో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2కి చేరుకుంది. ఇక్కడ పుణేరి బప్పాతో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..