పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ ఆర్డర్ లో ఉన్న పోలీసులు డ్రిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో పోలీసుల్లో ఊబకాయం పెరిగిపోయింది. అయితే అటువంటి వారు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా సూర్యనమస్కరాల శిల్పాక్రుతిని ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.

Yoga Pose 2
ఒక్కో నమస్కారానికి ఒక్కో విగ్రహాన్ని పెట్టి అన్ని కలిపి పక్కపక్కనే వచ్చేలా ఏర్పాటు చేసిన ప్రతిమ ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటివరకూ నగరంలో ఇటువంటి విగ్రహాలు లేవు. మొట్ట మొదటి సారి సులభంగా అర్దం అయ్యేలా సూర్య నమస్కారాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు సతీష్ కుమార్ ను అభినందించారు.
అధిక ఒత్తిడి ఎదుర్కోనే శాఖల్లో పోలీస్ శాఖ ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బిపి, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని లైఫ్ స్టైల్ డిసీజ్ ల నుండి దూరంగా ఉండాలంటూ తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగా చేయాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సిబ్బందిలో అవగాహక కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించి సూర్య నమస్కారాలు చేసేందుకు ఈ ప్రతిమను పెట్టామన్నారు. ఒక్క పోలీసులే కాకుండా ఎస్పీ కార్యాలయం ఎదుట నుండి వచ్చే పోయే వారందరికి ఈ ప్రతిమ కనిపిస్తుంది. దీన్ని చూసైనా కొంతమందిలో మార్పు వచ్చి సూర్య నమస్కరాలు చేస్తారన్న భావన ఎస్పీ వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..