కొండచిలువలు పరిమాణంలో భారీగా ఉండటమే కాదు.. పొడవు కూడా ఎక్కువగానే పెరుగుతాయ్. ఆహారం కోసం జంతువులను మాత్రమే కాదు.. మనుషులను కూడా అమాంతం మింగేస్తాయ్. అంతటి కొండచిలువ మనకు కనిపిస్తే ఏమవుతుంది.? ఠక్కున గుండె ప్యాంట్లోకి జారిపోతుంది. మరి ఆ తరహ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. కొంతమంది టూరిస్టులు, ఓ టూర్ గైడ్కి ఉబ్బిన పొట్టతో దూరంగా ఓ కొండచిలువ కనిపించింది. ఏమై ఉంటుందని.. అనుమానమొచ్చి.. దగ్గరకు వెళ్లి చూడగా.. అది ఎంచక్కా తన మధ్యాహ్న భోజనాన్ని ఆరగించి.. రెస్ట్ తీసుకుందని గ్రహించారు. సెంట్రల్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ తన మీల్స్ ఆరగించి.. నెమ్మదిగా నేలపై పాకుతూ కనిపించింది.
సజీవంగా ఉన్న ఇంపాలాను మింగేసిన పైథాన్.. ఆ తర్వాత సుమారు వారం లేదా నెలల పాటు భోజనం చేయకుండా ఉంటుందని ఆ టూర్ గైడ్ చెప్పాడు. ఆఫ్రికాలోని వెస్ట్రన్ సెరెంగేటి నేషనల్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. “వావ్! ఇది మైండ్ బ్లోయింగ్” అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..