హీరో మోటోకార్ప్ కంపెనీకు చెందిన విడా జూలై 1, 2025న తన తదుపరి ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. భారతీయులకు తక్కువ ధరకు ఈవీ అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఓ కొత్త ప్రణాళిక వేసింది. హీరో తీసుకొచ్చిన ఈ ప్రణాళికతో భవిష్యత్తో ఈవీ వాహన రంగంలో పెను సంచలనాలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరూ బ్యాటరీతో సహా ఈవీను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈవీ స్కూటర్ ధర అమాంతం పెరుగుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా సబ్స్క్రిప్షన్ బ్యాటరీ విధానంతో హీరో ఈవీ కొత్త ప్రణాళికను పరి చేసింది. వీఎక్స్2 ఈవీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్) ప్లాన్తో లాంచ్ చేసింది. వినియోగదారులు స్కూటర్ను మాత్రమే కొనుగోలు చేసి దాని బ్యాటరీకు మాత్రం సబ్స్క్రిప్షన్ను చెల్లించాల్సి ఉంటుంది.
హీరో తీసుకొచ్చిన ఈ కొత్త ప్రణాళికతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ముందస్తు ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మోడల్ కింద, వినియోగదారులు సౌకర్యవంతమైన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ నిర్వహణతో పాటు భర్తీ విషయానికి వస్తే ఆ బాధ్యతలు సబ్స్క్రిప్షన్ విధానంలో ఉంటాయి కాబట్టి ధర భారీగా తగ్గుతుంది.
హీరో విడా వీఎక్స్2 ఈవీ స్కూటర్ హై-ఎండ్ విడా వీ2 స్కూటర్కు బడ్జెట్- ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయమని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నాు. ఈ రెండు స్కూటర్లు కొంత అంతర్గత హార్డ్వేర్లు ఒకే మాదిరిగా ఉంటాయి. వీఎక్స్-2 సరళమైన మరింత ఆచరణాత్మక డిజైన్తో ఆకర్షిస్తుంది. డిస్క్ కు బదులుగా డ్రమ్ బ్రేక్లు, చిన్న టీఎఫ్టీ డిస్ప్లేతో పాటు సింగిల్ సీట్ సెటప్తో వస్తుంది. అందువల్ల ఈ స్కూటర్ బజాజ్ చేతక్ 3001, ఏథర్ 450ఎక్స్కు గట్టి పోటీనిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..