ఉమ్మడి కర్నూలు జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్న తేజేశ్వర్ జూన్ 17 నుంచి కనిపించకుండా పోయాడు. పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, యువతి తల్లి కలిసి పథకం ప్రకారం తేజేశ్వర్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*సీనియర్ అమ్మాయితో ప్రేమ.. పెళ్లి చేసుకుని 2 నెలలు హ్యాపీ.. ఆ తర్వాతే, తలకిందులైన యువకుడి జీవితం..
ఈ క్రమంలోనే శనివారం గద్వాల పోలీసులు కర్నూలుకు వచ్చారు. కర్నూలు పోలీసుల సహకారంతో తేజేశ్వర్ మొబైల్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ ట్రేస్ చేశారు. ఈ క్రమంలోనే పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
*ఆ ప్రభుత్వ పాఠశాలకు ఫుల్లు డిమాండ్.. అడ్మిషన్స్ క్లోజ్ బోర్డే పెట్టేశారు..
కర్నూలు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మరోవైపు తేజేశ్వర్కు ఇటీవలే పెళ్లి జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన యువతిని తేజేశ్వర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి తల్లికి, కర్నూలులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. యువతి తల్లి ఆ బ్యాంకులో చిరుద్యోగి. ఈ క్రమంలోనే ఆమెకు, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. అయితే తేజేశ్వర్ యువతిని ప్రేమ పెళ్లి చేసుకోవటం.. ఆ యువతి తల్లికి, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు నచ్చలేదు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ను ఇద్దరు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో పాటుగా మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
*ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు..
భూమి సర్వే ఉందని తెలిసిన వారితో తేజేశ్వర్కు ఫోన్ చేసి రప్పించారని.. అలా నమ్మి వచ్చిన తేజేశ్వర్ను బ్యాంకు మేనేజర్ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం పిన్నాపురం చెరువు సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పెళ్లైన నెల రోజులకే ఇలా వరుడు అనుకోని రీతిలో చనిపోవటంతో.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు తన సోదరుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేజేశ్వర్ సోదరుడు కోరుతున్నారు.