Guntur Traffic Restrictions And Diversions: గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ వద్ద నూతన ఆర్వోబీ నిర్మాణం కారణంగా జూన్ 23 నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక మార్గాలను సూచిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.
హైలైట్:
- గుంటూరు నగర ప్రజలకు పోలీసుల అలర్ట్
- నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు అమలు
- నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి

2. MTB (రమేష్ హాస్పిటల్ కూడలి) సెంటర్: Lodge సెంటర్ వెళ్లే హెవీ వెహికల్స్ :-రమేష్ హాస్పిటల్ → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం వినియోగించాలి. (స్కూల్, కాలేజ్ బస్సులకు కూడా వర్తించును).
3. Lodge సెంటర్ → MTB సెంటర్: అటు వైపు కార్లు, ఆటోలు, టూ వీలర్లు: అరండల్ పేట → పొట్టి శ్రీరాములు నగర్ → డొంక రోడ్డు → మూడు వంతెనలు లేదా బ్రాడీపేట → కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా ప్రయాణించవచ్చు.
4. కోబాల్ట్ పేట, కృష్ణా నగర్, చంద్రమౌళి నగర్, బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుండి మార్కెట్ వైపుకు వచ్చే కార్లు, ఆటోలు, టూ-వీలర్లు:- పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట 18 లైన్ ద్వారా →కంకరగుంట అండర్పాస్ →కలెక్టర్ ఆఫీస్ రోడ్ →రమేష్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాలి
5. MTB సెంటర్ → Lodge సెంటర్ వచ్చు కార్లు, ఆటోలు, టూ వీలర్లు :-శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ప్రయాణించవచ్చు.
6. పట్టాభిపురం → GGH వెళ్లే వారు:– కంకరగుంట ఫ్లైఓవర్ → మెడికల్ కాలేజ్ → శంకర్ విలాస్ అండర్పాస్ మార్గంలో వెళ్లాలి.
7. మూడు వంతెనలు → GGH వెళ్లే వారు :-Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గాన్ని అనుసరించాలి.
8.GGH → MTB సెంటర్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → Woman’s కాలేజీ రోడ్ మార్గం వినియోగించాలి.
9.GGH → బస్టాండ్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → భగత్ సింగ్ విగ్రహం మార్గంలో వెళ్లాలి.
10. బస్టాండ్ → GGH భగత్ సింగ్ విగ్రహం → Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గంలో వెళ్లాలి.
గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే
11. Lodge సెంటర్ → MTB సెంటర్ హెవీ వెహికల్స్ :- చిల్లీస్ → ఇన్నర్ రింగ్ రోడ్→ ఆటొ నగర్→బస్ స్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాల్లో ప్రయాణించాలి’ అని ప్రకటనలో తెలిపారు పోలీసులు.