హిందూ మతంలో ‘గయ’ని ‘మోక్షభూమి’ అని పిలుస్తారు. పూర్వీకులకు పిండదానాన్ని అందించే అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ తర్పణం , పిండ ప్రదానం చేయడం ద్వారా, పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. ఇది పురాణాలు, గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. గయలో పిండదానాన్ని అందించడం ద్వారా పూర్వీకులకు మోక్ష మార్గం సులభం అవుతుంది. వారు స్వర్గాన్ని పొందుతారు. గయలో పిండదానాన్ని అందించడం ద్వారా.. ప్రజలు పితృ రుణం నుంచి విముక్తి పొందుతారు, ఎందుకంటే విష్ణువు స్వయంగా ఇక్కడ పితృ దేవతగా నివసిస్తాడు. పిండదానాన్ని అందించే వారిని ఆశీర్వదిస్తాడు. గయలో పిండదాన ప్రాముఖ్యతను పురాణాలు, గరుడ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం వంటి గ్రంథాలలో వివరంగా వివరించబడింది.
పురాణాల ప్రకారం గయాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉన్నాడు. అతన్ని ఎవరు చూసినా వారి పాపాలు నశించిపోతాయి. వారికి మోక్షం లభిస్తుందని బ్రహ్మ నుంచి వరం పొందాడు. ఈ వరం కారణంగా ప్రజలు నేరుగా మోక్షాన్ని పొందడం ప్రారంభించారు. దీని కారణంగా యమలోకంలో జనసమూహం తగ్గింది. మతపరమైన నియమాలు ఉల్లంఘించడం ప్రారంభమైంది. ఈ సమస్యను పరిష్కరించమని దేవతలు విష్ణువును అభ్యర్థించారు. విష్ణువు గయాసురుడిని తన శరీరాన్ని యజ్ఞం కోసం ఇవ్వమని కోరాడు. గయాసురుడు అంగీకరించాడు.
గయాసురుడి శరీరం చాలా పెద్దదిగా ఉండటంతో దేవతలు కూడా అతనిపై యజ్ఞం చేయడంలో ఇబ్బంది పడ్డారు. చివరికి శ్రీ మహా విష్ణువు తన పాదంతో గయాసురుడిని నొక్కాడు. గయాసురుడి శరీరం రాయిగా మారి వ్యాపించింది. ఈ ప్రదేశం గయ నగారంగా పిలువబడుతోంది. గయాసురుడి భక్తి, త్యాగానికి సంతోషించిన విష్ణువు.. ఈ ప్రదేశంలో ఎవరైతే తమ పూర్వీకుల కోసం పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసే వారి పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని, వారు నేరుగా స్వర్గానికి వెళతారని వరం ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
విష్ణువు నివాసం
గయ ప్రాంతంలో శ్రీ మహా విష్ణువు స్వయంగా పితృదేవతగా నివసిస్తున్నాడు. ఆయనను ‘గదాధరుడు’గా పూజిస్తారు. ఈ భూమిపై విష్ణువు పాదముద్రలు ఉన్నాయని.. ఈ పాదాలను చూసినా పాపాలు నశిస్తాయని నమ్ముతారు. భక్తుడు ఇక్కడ పిండాన్ని పెట్టినప్పుడు శ్రీ మహా విష్ణువు స్వయంగా పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
పితృ ఋణం నుంచి విముక్తి
గయలో పిండ దానం చేసిన వ్యక్తి పితృ ఋణం నుంచి విముక్తి పొందుతాడు. హిందూ మతంలో పితృ ఋణం నుంచి ఒక ముఖ్యమైన రుణంగా పరిగణించబడుతుంది. దీనిని తప్పని సరిగా పిల్లలు తిరిగి చెల్లించాలని నమ్మకం. గయలో పిండ ప్రదానం చేయడం ద్వారా 108 వంశాల పూర్వీకులు, 7 తరాల వరకు మోక్షం పొందుతారని నమ్ముతారు.
గయలో ఇతర ప్రత్యేక పవిత్ర స్థలాలు
గయలో పిండప్రదానానికి మూడు ప్రధాన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. విష్ణుపాద ఆలయంలో విష్ణువు పాదముద్రలు ఉన్నాయి. ఫాల్గు నదిలో తర్పణం , పిండదానం చేస్తారు. ఫాల్గు నది అదృశ్యంగా ప్రవహిస్తుందని నమ్ముతారు.
అక్షయవత్ అనేది ఒక పురాతన మర్రి చెట్టు. దీని కింద పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకులకు శాశ్వత సంతృప్తి లభిస్తుంది.
రాముడు సీతలు దశరధుకి శ్రాద్ధ కర్మలను చేసిన ప్రదేశం
రామాయణ కాలంలో రాముడు తన తండ్రి దశరథుడి ఆత్మ శాంతి , మోక్షం కోసం గయలో పిండ దానాన్ని నిర్వహించారు. మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ శ్రాద్ధ కర్మను చేశారు. ఈ ఘటనలు ఈ ప్రదేశం ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఇతర తీర్థయాత్రలలో పిండ దానానికి కొన్ని నిర్దిష్ట సమయాలు ఉన్నాయి. అయితే గయలో ఎప్పుడైనా పిండ దానాన్ని చేయవచ్చు. ఇక్కడ సమయంపై నిషేధించబడలేదు. కొన్ని నమ్మకాల ప్రకారం.. గయలో పిండ దానాన్ని చేసిన తర్వాత పూర్వీకులు ‘పరమగతి’ని పొందుతారు. వారు పిత్రలోకం లేదా స్వర్గానికి వెళతారు. దీని కారణంగా వారు ఇకపై వార్షిక శ్రాద్ధ కర్మలు చేయవలసిన అవసరం ఉండదు.
ఇది పండితులు, సంప్రదాయాల నమ్మకం
గయలో పిండ ప్రదానం చేసిన తర్వాత కూడా పూర్వీకుల పట్ల గౌరవం, భక్తిని వ్యక్తపరచడానికి వార్షిక శ్రాద్ధ కర్మను ఆచరించాలని కొంతమంది పండితులు, సంప్రదాయాలు కూడా నమ్ముతున్నాయి. ఇది ఆ ప్రత్యేక పితృస్వామ్యానికి కృతజ్ఞత, జ్ఞాపకార్థ చిహ్నం, ఇది సంతానానికి పుణ్యాలను కూడబెట్టుకునే మార్గం కూడా. గరుడ పురాణం కూడా వార్షిక శ్రాద్ధ కర్మల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అందువల్ల ఇది వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. అయితే గయలో చేసే పిండ ప్రదానం పూర్వీకులకు ప్రత్యేక మోక్షం, శాంతిని అందిస్తుంది. ఇది ఇతర ప్రదేశాలలో చేసే పిండ ప్రదానం కంటే భిన్నంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.