భారతీయులు తమ భవిష్యత్ కోసం అమెరికా బాట పట్టడమే కాదు.. అగ్రరాజ్యం నుంచి కూడా భారత దేశానికి కొంతమంది వస్తారు. అలా కొలరాడోకు చెందిన క్రిస్టేన్ ఫిస్కేర్ నాలుగేళ్ళ క్రితం భారత దేశానికి తన ఫ్యామిలీతో వచ్చారు. దేశ రాజధాని డిల్లీలో భర్త,నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. స్కై ఫిష్ డెవలప్ మెంట్ అనే పేరుతో ఐటీ కంపెనీని రన్ చేస్తున్నారు. కాగా క్రిస్టేన్ ఫిస్కేర్ ఈ నెల 12 వ తేదీన ఒక రీజ్ లో షేర్ చేశారు. ఇందులో నా మాట వినండి.. భారతదేశానికి వెళ్ళాలని అనుకోకండి… ఎందుకంటే అక్కడే జీవితాంతం నివసించాలనే కోరికని కలిగిస్తుంది. ఇక్కడ మీరు అద్భుతమైన వ్యక్తులను కలుస్తారు.. రుచికరమైన అద్భుతమైన ఆహరాన్ని తింటారు. కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూడడమే కాదు.. దేశంలోని గొప్ప సంస్కృతి, చరిత్రను ప్రతి నిమిషం అనుభవిస్తారు. దీంతో ఎప్పటికీ భారత దేశాన్ని విడిచి మీరు మీ దేశాలకు వెళ్ళాలని కోరుకోరు. ఎందుకంటే మీ హృదయంలో భారత దేశం నిలిచి ఉంటుంది. మీ జీవితాన్ని అందంగా.. అద్భుతంగా మార్చే ప్రదేశం.. దీంతో మళ్ళీ మీ సొంత దేశానికి వెళ్ళాలనే ఆలోచన కూడా కలిగించందు అని భారత దేశం గురించి చెప్పడమే కాదు.. తాను భారత దేశంలో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.. అంటూ ఒక లవ్ సింబల్ తో ఉన్న ఒక రీల్ ని చేసింది.
ఇన్ డైరెక్ట్ గా భారత దేశం గొప్పదనం గురించి చెప్పడం తో నెటిజన్ల హృదయాన్ని గెలుచుకుంది ఈ వీడియో. ఓ రేంజ్ లో నెటిజన్లు స్పందిస్తున్నారు. అంతేకాదు చాలామంది విదేశీయులు తమ భారత దేశ పర్యటనని… అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకరు మీరు చెప్పింది నిజం… నేను భారత దేశానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ దేశం విడిచి సొంత దేశానికి వెళ్లాలనుకోలేదు అని కామెంట్ చేశారు. తనకు భారత దేశమ అన్నా.. ఆ దేశస్తులు అన్నా చాలా ఇష్టం అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొక టూరిస్ట్ భారత దేశ పర్యటన గురించి తన అనుభవాన్ని గురించి చెబుతూ.. తాను 2018లో ఫస్ట్ టైం భారత్ కి వచ్చినట్లు.. 3 నెలలు అనేక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి సొంత దేశానికి వెళ్తుంటే.. తనకు ఏడుపొచ్చిందని చెప్పాడు. తర్వాత 2019లో కేరళలో ఒక ప్లేస్ లో కొనుగోలు చేశానని.. 2021 నుంచి భారత్ లోనే నివాసం ఉంటున్నానని చెప్పాడు.
భారత దేశం గురించి మరొక వీడియోను జూన్ 22న క్రిస్టేస్ ఫిష్కేర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది కూడా ఓ రేంజ్ లో నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కూడా అమెరికాలో సగటు జీవితం గడపడం కంటే భారత్ లో అసాధారణ జీవితాన్ని గడపడానికే తాను ఇష్టపడినట్లు క్రిస్టేన్ చెప్పింది. గత 4 ఏళ్ల నుంచి భారతదేశంలో ఉంటున్నాం.. ఒక్కసారి కూడా మేము చింతించలేదని చెప్పింది. మొత్తానికి భారతదేశం తమా కుటుంబ సభ్యుల జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..