మొఘల్ కాలంలో, ముస్లింలలో విడాకుల కేసులు చాలా తక్కువ. ఆ కాలంలో ప్రజలు విడాకులను చాలా చెడ్డగా భావించేవారు. ఎవరైనా విడాకులు తీసుకున్నారని తెలిస్తే, అతని చంపడానికి సైతం వెనుకాడేవారు కాదు. మొఘల్ కాలంలో, పురుషులు ఆధిపత్యం వహించారు. విడాకుల విషయంలో వారు ఏకపక్షంగా ఉండేవారు.
'మజ్లిస్-ఎ-జహంగిరి' ప్రకారం, భార్యకు తెలియకుండా భర్త విడాకులు ప్రకటించడం చట్టవిరుద్ధమని జహంగీర్ ప్రకటించారు. 'మజ్లిస్-ఎ-జహంగిరి' ఆదేశం తరువాత, పురుషుల ఏకపక్షం ఆగిపోయింది. మహిళలు తమ స్వరాన్ని పెంచే శక్తిని పొందారు. మౌఖిక తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు తమ స్వరం పెంచడం ప్రారంభించారు.
మొఘలుల కాలంలో పేద ముస్లింలలో అందరి ముందు మాటలతో వాగ్దానాలు చేసేవారు. అయితే వ్రాసిన నిఖానామా లేదా ఒప్పందం సంపన్న తరగతి లేదా ధనవంతుల మధ్య ప్రబలంగా ఉండేది. అప్పట్లో వివాహ ఒప్పందానికి నాలుగు షరతులు ఉండేవి.
మొదటి షరతు భార్య బతికుండగా భర్త మళ్లీ పెళ్లి చేసుకోకూడదు. రెండోది భార్యపై చేయి ఎత్తకూడదు. మూడోది భార్యకు దూరంగా ఎక్కువ కాలం ఉంటే భర్తే అన్ని చూసుకోవాలి. నాల్గవది భార్య జీవించి ఉండగానే భర్త మరొకరిని వివాహం చేసుకోకూడదు.ఈ నాలుగు షరతుల్లో మొదటి మూడింటిని విచ్ఛిన్నం చేస్తే, వివాహం రద్దు చేయవచ్చు. నాల్గవ షరతు విషయంలో, ఒక వ్యక్తికి బానిస అమ్మాయి ఉన్నట్లు తేలితే, ఆ వ్యక్తి భార్యకు ఆమెపై పూర్తి హక్కులు ఉంటాయి.
మొఘల్ కాలంలో, రాజ కుటుంబానికి విడాకుల విషయంలో అపారమైన హక్కులు ఉండేవి. రాజు కావాలనుకుంటే, అతను ఒకరి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒకసారి షాజహాన్ తన అధికారిపై కోపంతో అతని వివాహం చట్టవిరుద్ధమని ప్రకటించాడు.