వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. సింగయ్య మృతి కేసులో పోలీసులు వైఎస్ జగన్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్కు నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వైెఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమతో పాటుగా తీసుకెళ్లారు.

మరోవైపు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా ఉన్నారు. ఏ2గా వైఎస్ జగన్, ఏ3గా కారు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫార్చూనర్ కారును వైసీపీ పార్టీ పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. అలాగే ప్రతినిధిగా వైఎస్ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్రెడ్డి పేరు పెట్టినట్లు సమాచారం. జగన్ పల్నాడు పర్యటనలో ఈ వాహనం కింద పడే సింగయ్య మరణించినట్లు ఆధారాలు లభ్యం కావటంతో నల్లపాడు పోలీసులు.. ఈ వాహనాన్ని సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు.
వైఎస్ జగన్కు మరో షాక్.. బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్! తమతో తీసుకెళ్లిన పోలీసులు
జూన్18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రెంటపాళ్లలో ర్యాలీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. వైఎస్ జగన్ కాన్వాయి కిందపడే సింగయ్య చనిపోయినట్లు వీడియో బయటకు వచ్చింది. ఏటుకూరు వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి టర్న్ తీసుకునే సమయంలో.. వైసీపీ శ్రేణులు జగన్ ఉన్న కారుపైకి ఎక్కి హంగామా చేశారు. ఈ సమయంలో సింగయ్య కారు కింద పడినట్లు వీడియోలో ఉంది. దీంతో వైఎస్ జగన్ మీద కేసు నమోదైంది.మరోవైపు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్ కారును వైఎస్ జగన్ సొంత నిధులతో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేదంటూ తానే స్వయంగా కొనుగోలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఈ వాహనానికి డ్రైవర్ను కేటాయించింది.