Samayam Telugu•
Vijayawada Police Raid On Ysrcp Leader Building: విజయవాడలో ఓ వైఎస్సార్సీపీ నేతకు చెందిన భవనంలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. గవర్నర్పేటలో జరిగిన ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించి, పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యం పాత్రపై అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక, బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది.
హైలైట్:
- విజయవాడలో మరో చీకటి దందా గుట్టురట్టు
- వైఎస్సార్సీపీ నేత భవనంలో రహస్యంగా
- పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్

వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో
యువతుల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి విటులను ఆకర్షించేవారని.. మొబైల్లో వారితో మాట్లాడిన తర్వాత. విటులు రహస్యంగా గవర్నర్పేటలోని ఈ భవానికి తీసుకొచ్చేవారు.. అక్కడ నాలుగో అంతస్తులో వ్యభిచారం చేయించేవారని చెబుతున్నారు. విజయవాడ దుర్గాఅగ్రహారానికి చెందిన కోసూరి సుబ్రహ్మణ్యం గతంలో టీడీపీలో ఉండగా.. ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ పక్కన పెట్టింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరారు. సుబ్రహ్మణ్యంపై గతంలో కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఫ్లాంట్ కొనుగోలు అంశంపై 2021లో కేసు నమోదనట్లు చెబుతున్నారు. మొత్తం మీద విజయవాడలో వ్యభిచార గృహం వ్యవహారం కలకలం రేపింది. నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్టు వేస్తున్నారు.. రాత్రి వేళల్లో గస్తీని పెంచారు.. పెట్రోలిగ్ నిర్వహిస్తున్నారు. స్వయంగా సీఐ స్థాయి అధికారులు రంగంలోకి దిగుతున్నారు.