మానసిక ప్రశాంతత, స్థిరత్వం: మానస సరోవర సరస్సును బ్రహ్మ దేవుడు స్వయంగా సృష్టించాడని నమ్ముతారు. దీనిని మనస్సు యొక్క సరస్సు (మానస + సరోవర) అని కూడా పిలుస్తారు. ఈ సరోవరంలొని నీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఈ స్పష్టమైన నీటిలో, కైలాస పర్వతం దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో స్నానం చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు అపారమైన శాంతి, స్థిరత్వం లభిస్తుంది. ఇది దురాశ, అనుబంధం, అహంకారం, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.