లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా ఓడిపోయి ఉండవచ్చు. కానీ, భారత జట్టు ఆటగాళ్ళలో ఒకరు అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. లీడ్స్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే, అతని సెంచరీలు టీం ఇండియా పై భారంగా మారాయి. ఇలా అనడంలో వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కానీ, గత రికార్డులు చూస్తే పంత్ సెంచరీతో భారత జట్టు పరిస్థితి కష్టంగా మారుతుందంట. ఈ గణాంకాలు చూస్తే నిజంగా షాకింగ్ గా ఉన్నాయి.
నిజానికి, రిషబ్ పంత్ విదేశీ గడ్డపై సెంచరీ చేసినప్పుడల్లా, టీం ఇండియా ఎప్పుడూ మ్యాచ్ గెలవలేకపోయింది. పంత్ విదేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ప్రతిసారీ టీం ఇండియా విజయం నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది.
2018లో పంత్ ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడు. టీం ఇండియా ఆ మ్యాచ్ లో ఓడిపోయింది. 2019లో ఆస్ట్రేలియా పై అజేయంగా 159 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ డ్రా అయింది. 2022లో దక్షిణాఫ్రికా పై అజేయంగా 100 పరుగులు చేశాడు. ఫలితం మళ్ళీ ఓటమి. 2022లోనే పంత్ ఇంగ్లాండ్ పై 146 పరుగులు చేశాడు. టీం ఇండియా ఆ మ్యాచ్ లో ఓడిపోయింది.
ఇప్పుడు లీడ్స్లో, పంత్ 134, 118 పరుగుల ఇన్నింగ్స్లు ఆడాడు. టీమ్ ఇండియా మళ్ళీ ఓటమిని ఎదుర్కొంది. పంత్ సెంచరీ తర్వాత అదృష్టం టీమ్ ఇండియాకు అనుకూలంగా లేదని స్పష్టంగా తెలుస్తుంది.
అయితే, ఇందులో రిషబ్ పంత్ తప్పు ఏమిటి? ఈ ఆటగాడు వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా తన పనిని చేస్తున్నాడు. కొన్నిసార్లు ఇతర బ్యాటర్స్ అతనికి మద్దతు ఇవ్వడం లేదు. కొన్నిసార్లు బౌలర్లు విఫలమవుతున్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో పంత్ కనీసం మూడు సెంచరీలు సాధిస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఇది జరిగితే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో చూడటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.