వర్షాకాలం వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినా.. రుతుపవనాల ప్రారంభంతో వచ్చే ఆరోగ్య సమస్యలు పెద్ద సమస్యగా మారుతాయి. ఈ సమయంలో మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడం ఓ సవాలు. ముఖ్యంగా ఈ కాలంలో మన శరీర రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం మంచి ఆహారం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి వానా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? వంటి ప్రశ్నలకు పసుపు పాలు సమాధానం. అవును.. రోజూ పసుపు కలిపిన పాలు తాగడం వల్ల మనం ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కొంతమందికి పసుపు కలిపిన పాలు తాగే అలవాటు ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా వర్షా కాలంలో పసుపు కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి వర్షంలో దీన్ని తాగడం వల్ల వైరల్ జ్వరం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు ఒక గ్లాసుడు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల త్వరగా నిద్రపోతారు. ఇది జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది. మలబద్ధకం సమస్యల నుండిచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. పసుపు కలిపిన పాలు తీసుకోవడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మంచిది. తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ పసుపు పాలు మహిళలు అనుభవించే పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అదనంగా ఇది అధిక రక్తస్రావం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.