
జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రధానంగా FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఒక ప్రధాన విధాన మార్పుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండియా టూడే ఒక కథనంలో పేర్కొంది. ఇప్పటి వరకు హైవేలపై బైకులకు టోల్ లేకుండా మినహాయింపు ఇచ్చారు. కానీ రానున్న రోజుల్లో హైవేపై బైకులపై వెళ్లే వారి నుంచి టోల్ వసూలు చేసే అవకాశం ఉందని ఆ కథనం తెలిపింది.
జూలై 15 నుంచి మారబోతోంది?
జూలై 15 నుంచి హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద ద్విచక్ర వాహనాలను టోల్ విధానంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అధికారిక ప్రభుత్వ నోటిఫికేషన్ ఇంకా రానప్పటికీ, ఈ విధానంపై ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ద్విచక్ర వాహన యజమానులు ఇవి తప్పక చేయాల్సిందే.. ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాలి, దానిని వారి బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్కు లింక్ చేయాలి, సజావుగా టోల్ చెల్లింపుల కోసం వారి వాహనానికి FASTagను అతికించాలి.
హైవేలపై తిరిగే బైకుల సంఖ్య పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. న్యాయమైన, స్థిరమైన నిధుల నమూనాకు మౌలిక సదుపాయాల నిర్వహణకు వాటి సహకారం అవసరమని భావిస్తున్నారు. అందుకే వాటిని కూడా టోల్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోడ్డు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరుగుతున్నందున, రోడ్డు వినియోగదారులందరూ నిర్వహణ, విస్తరణ ఖర్చులకు దోహదపడేలా ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వం కొత్త టోల్ చెల్లింపు నమూనాలను కూడా రూపొందిస్తోంది, అవి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక టోల్ పాస్, వార్షిక టోల్ పాస్ (ATP), ఇవి జాతీయ రహదారులపై అపరిమిత ప్రయాణాన్ని నిర్ణీత వార్షిక రుసుముతో అనుమతిస్తాయి, ప్రస్తుతం ప్రైవేట్ వాహన యజమానులకు రూ. 3,000గా ప్రతిపాదించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి