Ntr Bharosa Pension Scheme Spouse Category: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతు పింఛన్లపై దృష్టి సారించింది. గతంలో నిలిచిపోయిన రెండు లక్షల పింఛన్లను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరించి, అర్హులకు పింఛన్లు అందించనున్నారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా మంజూరైన 71,380 స్పౌజ్ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పింఛన్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే!
హైలైట్:
- ఏపీలో వితంతువులకు పింఛన్లు
- మరో 2 లక్షలమందిక పింఛన్లు
- 2 లక్షల మంది వివరాలు పంపారు

అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని భావించారు.. కానీ వాయిదా పడింది. రాష్ట్రంలో భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ పింఛన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే, అతని భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా చేశారు.
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు
ఈ పథకం గతేడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య స్పౌజ్ పింఛన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 71,380 మందిని పింఛన్కు అర్హులుగా గుర్తించారు. వీరందరికీ మే నెలకు సంబంధించిన రూ.4 వేల పింఛన్ను జూన్ 12న పంపిణీ చేయాలని భావించారు.. కానీ వాయిదా వేశారు. అయితే జులై నెలలో వీరికి ప్రతి నెలా రూ.4వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.