Renigunta Kadapa National Highway 716 Works: తిరుమల భక్తులకు శుభవార్త! కడప నుండి తిరుపతికి నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. అటవీ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా అండర్పాస్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణం సులభతరం అవుతుంది.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవేకు గ్రీన్సిగ్నల్
- రూ.2,500 కోట్లు కేటాయించిన కేంద్రం
- త్వరలోనే పనులు ప్రారంభించే ఛాన్స్

ఏపీలో కొత్తగా ఈ రూట్లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంశాన్ని చొరవ తీసుకుని అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చేసింది. ‘ఈ రోడ్డు అనుమతుల విషయంలో వన్యప్రాణుల జాతీయ సంస్థ కమిటీ అధికారులను ఒప్పించగలిగాము. కేంద్రం అన్ని రకాల సహకారం అందించింది. వచ్చే నెలలో పనులు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తిరుపతికి త్వరగా వెళ్లొచ్చంటున్నారు.