Krishna Canal Guntur New Third Railway Line,ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే! – krishna canal to guntur new third railway line proposed to union government
Krishna Canal Guntur Third Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే సౌకర్యం మరింత మెరుగుకానుంది. విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపనుంది. దాదాపు రూ.1,200 కోట్లతో కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య ఈ లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు లైన్లపై రద్దీ తగ్గించి, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యం. అంతేకాకుండా గూడూరు-విజయవాడ మూడో లైన్ను విజయవాడ వరకు పొడిగించాలని కోరుతున్నారు.
హైలైట్:
ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్
రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు
ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపారు
కృష్ణా కెనాల్-గుంటూరు కొత్త రైల్వే లైన్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా మూడో రైల్వే లైన్ రాబోతోంది. విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్కు కేంద్రం త్వరలో ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య కొత్త లైన్ కోసం సర్వే చేశారు.. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య రైల్వే లైన్ చాలా రద్దీగా ఉంది.. రోజుకు దాదాపు 100 రైళ్లు తిరుగుతున్నాయి. ఇది మెయిన్ లైన్ కావడంతో గూడ్స్ రైళ్లు కూడా వెళ్తున్నాయి. అందుకే రద్దీ ఎక్కువైంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ, గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు వేగంగా జరుగుతాయంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి.. మూడో లైన్ వేయడానికి సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టును దక్షిణ మధ్య రైల్వేకు పంపగా.. అక్కడ పరిశీలన తర్వాత రైల్వే బోర్డుకు పంపుతారు. అయితే ఈ మూడో లైన్ నిర్మాణానికి సర్వే నివేదిక అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. త్వరగా అనుమతులు వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. మూడో లైన్ పూర్తయితే విజయవాడ, గుంటూరు మధ్య ప్రయాణం సులువుగా ఉండటంతో పాటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయి అంటున్నారు. రైళ్ల సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు.
ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
అంతేకాదు గూడూరు నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న మూడో రైల్వేలైన్ కృష్ణా కెనాల్ జంక్షన్ వరకే ఉంది. అయితే ఈ లైన్ విజయవాడ రైల్వేస్టేషన్ వరకూ లైన్ పొడిగిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు. గూడూరు నుంచి కె.సి.జంక్షన్ వరకు వచ్చిన లైన్ను మరో నాలుగు కిలోమీటర్లు పొడిగించి విజయవాడ రైల్వేస్టేషన్కు కలపాలి అంటున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీలు ఈ మూడో అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరుతున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి